ETV Bharat / state

ఉద్ధృతంగా మున్నేరు...పెనుగంచిప్రోలు వంతెనను తాకిన వరద

author img

By

Published : Aug 15, 2020, 3:07 PM IST

గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద నీరు భారీగా చేరడంతో మున్నేరు నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. లింగాల వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. మునేటి కాలువలోకి వరద నీరు చేరుతుండడం వల్ల.. కాలువకు పలుచోట్ల భారీ గండ్లు పడ్డాయి. దీంతో అనాసాగరం ఆయకట్టులోని సుమారు వెయ్యి ఎకరాల పంటపొలాలు నీట మునిగాయి.

ఉద్ధృతంగా మున్నేరు...పెనుగంచిప్రోలు వంతెనను తాకిన వరద
ఉద్ధృతంగా మున్నేరు...పెనుగంచిప్రోలు వంతెనను తాకిన వరద

వరద తాకిడితో మున్నేరు నది నీటి ప్రవాహం గంట గంటకు పెరుగుతోంది. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు వద్ద వంతెనను తాకుతూ వరద నీరు ప్రవహిస్తోంది. వత్సవాయి మండలం లింగాల వంతెనపై మూడు అడుగుల ఎత్తు వరద నీరు ప్రవహిస్తోంది. జగ్గయ్యపేట వైపు నుంచి తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు వెళ్తే వాహనాలను పెనుగంచిప్రోలు వంతెన మీదుగా మళ్లిస్తున్నారు.

మునేటి కాలువకు గండ్లు

అనాసాగరం వద్ద మునేటి కాలువకు భారీగా గండ్లు పడ్డాయి. దీంతో వందలాది ఎకరాల పంటపొలాలు నీటిలో మునిగిపోయాయి. కాకులపొన్నారం నుంచి శనగపాడు మీదుగా అనాసాగరం ఆయకట్టు ఉంది. ఇప్పటికే రైతులు వెయ్యి ఎకరాలలో వరి నాట్లు వేశారు. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మునేటి కాలువలోకి భారీగా వరద చేరుతోంది. దీంతో కాలువకు గండ్లు పడి పంట చేళ్లను వరద ముంచెత్తుతోంది.

ఇదీ చదవండి : ఆగస్టులో చెల్లించాల్సిన వసతి దీవెన సాయం వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.