ETV Bharat / state

హైదరాబాద్​ భాగ్యలక్ష్మీ ఆలయంలో పూజలు చేసిన అమిత్​ షా

author img

By

Published : Nov 29, 2020, 12:48 PM IST

Amit Shah ghmc election campaign
హైదరాబాద్​ భాగ్యలక్ష్మీ ఆలయంలో పూజలు చేసిన అమిత్​ షా

జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా హైదరాబాద్​ లో పర్యటిస్తున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న అమిత్‌షాకు... భాజపా నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అమిత్‌షా బేగంపేట నుంచి పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ప్రచార బరిలోకి దిగారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి వెళ్లిన అమిత్‌షాకు... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఇతర నాయకులు పెద్దఎత్తున స్వాగతం పలికారు. అమిత్‌షా బేగంపేట నుంచి పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు.

హైదరాబాద్​ భాగ్యలక్ష్మీ ఆలయంలో పూజలు చేసిన అమిత్​ షా

ప్రత్యేక పూజల అనంతరం వారాసిగూడా చౌరస్తా నుంచి హనుమాన్ దేవాలయం మీదుగా సీతాఫల్ మండీ వరకు జరిగే రోడ్డు షోలో పాల్గొంటారు. మధ్యాహ్నం రోడ్డు షో ముగించుకొని భాజపా రాష్ట్ర కార్యాలయానికి వెళ్తారు. సాయంత్రం వరకు భాజపా నేతలతో సమావేశమవుతారు. అనంతరం బేగంపేట విమానాశ్రయానికి వెళ్లి... అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణంకానున్నారు.

జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారంలో అమిత్​షా

బల్దియా ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో... భాజపా రాష్ట్ర నాయకత్వం అమిత్ షాను రప్పించింది. ఆఖరి రోజు అమిత్ షా ప్రచారం మంచి ప్రభావం చూపే అవకాశం ఉందని పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి.

ఇదీ చదవండి:

ఏడు కొండలపై మనసు దోచుకుంటున్న మంచు అందాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.