Parents concern: ఉక్రెయిన్లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు.. ఆందోళనలో కూరుకుపోయారు. వారికి అక్కడ ఏమవుతుందోనంటూ తల్లిదండ్రులు బెంగపడుతున్నారు. కృష్ణాజిల్లా మైలవరంలో తాపీ మేస్త్రిగా విధులు నిర్వహిస్తున్న మాధు శ్రీనివాసరావు కుమారుడు... హేమంత్ కుమార్ ఉక్రెయిన్లోని కాచ్యులో మెడిసిన్ ద్వితీయ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్నాడు. రష్యా.. ఉక్రెయిన్పై దాడులకు పాల్పడుతున్న తరుణంలో హేమంత్ భారతదేశానికి తిరిగి వచ్చేందుకు ప్రయత్నిస్తూ... అక్కడే ఉండిపోయాడు. దీంతో హేమంత్ తల్లిదండ్రులు భయంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
ఉక్రెయిన్ ఇండియన్ ఎంబసీ అధికారులు హేమంత్ కుమార్తో పాటు భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రదేశానికి తరలించారు. గురువారం సాయంత్రం తల్లిదండ్రులకు అక్కడి పరిస్థితులను మెసెజ్ చేయడంతో అతని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ కుమారుడుని క్షేమంగా తిరిగి రప్పించేందుకు చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి:
Telugu Students @ Ukraine: 'ఉక్రెయిన్లో ఉన్న మా పిల్లలను స్వదేశానికి రప్పించాలి'