యనమలకుదురులో టీడీపీ 'ఇదేం ఖర్మ రాష్ట్రానికి'.. అడ్డుకునేందుకు వైసీపీ యత్నం

author img

By

Published : Nov 22, 2022, 8:23 PM IST

Updated : Nov 22, 2022, 10:44 PM IST

Tension At Idem Karma Program In Penamaluru

Tension At Idem Karma Program In Penamaluru : కృష్ణా జిల్లా పెనమలూరులో మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తలపెట్టిన 'ఇదేం ఖర్మ రాష్ట్రానికి' కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీసింది. వైకాపా నేతలు అక్కడికి చేరుకుని నిరసనను అడ్డుకునే ప్రయత్నం చేయటంతో దాదాపు 4గంటలపాటు హైడ్రామా నడిచింది. చివరికి వైకాపా నేతలూ, పోలీసులు వెనక్కి తగ్గటంతో తెదేపా నేతలు తమ నిరసనను విరమించారు. ఇదిలావుంటే అనుమతి లేకుండా నిరసన చేపట్టడంపై పోలీసులు బోడె ప్రసాద్​కు నోటీసులిచ్చారు. బుధవారం విచారణకు హాజరు కావాలని తెలిపారు.

యనమలకుదురు వంతెన నిర్మించాలని టీడీపీ నేతల డిమాండ్

Yanamalakuduru Bridge : కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో యనమలకుదురు గ్రామాన్ని- విజయవాడ బందరు రోడ్డుకు అనుసంధానించేందుకు వీలుగా తెదేపా ప్రభుత్వం ఐదేళ్ల క్రితం వంతెన నిర్మాణ పనుల్ని చేపట్టింది. తెదేపా ప్రభుత్వం దిగిపోయేనాటికి 90శాతం పనులు పూర్తయ్యాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక.. ఎక్కడి పనులు అక్కడే స్తంభించిపోయాయి. దీన్ని నిరసిస్తూ యనమలకుదురు బ్రిడ్జికి ఇదేం ఖర్మ అంటూ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ నిరసన కార్యక్రమం చేపట్టారు. కొందరు వైకాపా నేతలు అక్కడికి చేరుకుని ప్రతిగా నినాదాలు చేయటంతో ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాలు బాహీబాహీకి దిగే క్రమంలో పోలీసులు వారిని నెట్టడంతో తోపులాట జరిగింది.

వైకాపా నేతలు, పోలీసులు కుమ్మక్కై తమ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారంటూ తెదేపా నేతలు బ్రిడ్జిపై బైఠాయించి నిరసన కొనసాగించారు. బ్రిడ్జిపైకి ఎక్కేందుకు పెట్టుకున్న నిచ్చెనను పైకి తీసేసుకోవటంతో వారిని కిందకు దించటం పోలీసులకు కష్టతరమైంది. పోలీసులు తమ నేతల్ని అరెస్టు చేస్తే బందరు కాలవలోకి దూకుతానంటూ బోడేప్రసాద్ బ్రిడ్జ్ బెదిరించారు. పోలీసులు లైఫ్ జాకెట్లు, తాడులు కూడా సిద్ధం చేశారు. బ్రిడ్జి పైకెక్కి తెదేపా నేతల్ని దించే మార్గం కనిపించకపోవటంతో పోలీసులు చర్చల మార్గం ఎంచుకున్నారు.

వైకాపా నేతల్ని వెనక్కి పంపించి పోలీసులూ వెనక్కి వెళ్లిపోవాలన్న తెదేపా నేతల షరతుల్ని అంగీకరించి అందుకనుగుణంగా వ్యవహరించటంతో ఉద్రిక్తత సడలింది. కొనకళ్ల నారాయణ బ్రిడ్జి దిగి వాహనంలో యనమలకుదురు దాటి వెళ్లే వరకూ బోడే ప్రసాద్ దిగలేదు. కానూరు సిద్దార్థ ఇంజినీరింగ్ కళాశాల వద్ద కూడా పూర్తికాని మరో బ్రిడ్జిపై త్వరలోనే నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెదేపా నేతలు ప్రకటించారు.

పోలీసుల నోటీసులు: అనుమతి లేకుండా నిరసన చేపట్టారని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్​కు 41-ఏ కింద నోటీసులిచ్చారు. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బుధవారం విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Nov 22, 2022, 10:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.