ETV Bharat / state

'విజయవాడ అగ్నిప్రమాద ఘటనతో వైద్యులకు సంబంధం లేదు'

author img

By

Published : Aug 13, 2020, 8:14 AM IST

విజయవాడలోని స్వర్ణా ప్యాలెస్‌ హోటల్‌లో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనకు రమేష్‌ ఆస్పత్రుల యాజమాన్యానికి సంబంధం లేదని రాష్ట్ర కార్డియాలజికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా తెలిపింది.

State Cardiological Society of India clarification on vijayawada fire accident
రాష్ట్ర కార్డియాలజికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా

అగ్ని ప్రమాదానికి వైద్యులను బాధ్యులను చేయడం తగదని రాష్ట్ర కార్డియాలజికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు అధ్యక్షులు డాక్టర్‌ రాఘవశర్మ, కార్యదర్శి డాక్టర్‌ కార్తీక్‌లు సీఎం జగన్‌కు లేఖ రాశారు. విజయవాడలోని స్వర్ణా ప్యాలెస్‌ హోటల్‌లో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనకు రమేష్‌ ఆస్పత్రుల యాజమాన్యానికి సంబంధం లేదు. ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరించి మాత్రమే ఆస్పత్రి యాజమాన్యం ఆ హోటల్‌లో వైరస్‌ బాధితులకు చికిత్స అందిస్తోంది. అందులో జరిగిన అగ్ని ప్రమాదానికి వైద్యులను బాధ్యులను చేయడం ఆందోళన కలిగిస్తోంది. వైరస్‌ బాధితులకు చికిత్స అందించే వైద్యులను తప్పుబట్టే చర్యలు సరైనవి కావు అని పేర్కొన్నారు.

ఇదీ చూడండి. అడ్డదారి తొక్కిన ఖాకీలు... పట్టించిన సెల్​ఫోన్​ సిగ్నల్స్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.