ETV Bharat / state

అమరావతి రైతుల దీక్షకు సీనియర్ సిటిజన్స్​ మద్దతు

author img

By

Published : Dec 18, 2020, 12:50 PM IST

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తున్న దీక్షకు సీనియర్​ సిటిజన్స్​ బాసటగా నిలిచారు. వారికి మద్దతుగా చెన్నై - కోల్​కతా జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేశారు.

senior citizens
సీనియర్ సిటిజన్స్​ మద్దతు

అమరావతి రైతులు చేస్తున్న దీక్షలు ఏడాది పూర్తయిన సందర్భంగా ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని కావాలని కృష్ణా జిల్లా గన్నవరం సీనియర్ సిటిజన్స్ నినదించారు. రైతులకు మద్దతుగా చెన్నై - కోల్​కతా జాతీయ రహదారిపై చిన్నఅవుటపల్లి వద్ద 90 మంది విశ్రాంత ఉద్యోగులు, సీనియర్ సిటిజన్స్ నిరసన వ్యక్తం చేశారు. అందరికీ అందుబాటులో ఉండే రాజధాని అమరావతినే రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి :

పనికిరాని పదవులతో బీసీల కడుపు నిండదు: కొల్లు రవీంద్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.