ఓ ప్రింటింగ్ ప్రెస్ యజమాని వద్ద లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ కృష్ణా జిల్లా సహకార బ్యాంకు సీఈఓ ఎన్. రంగబాబు అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. 2020 సంవత్సర క్యాలెండర్లు, డెయిరీల ముద్రణకు సంబంధించి రూ.7.58 లక్షల ఆర్డర్ ఇచ్చేందుకు ఐదు లక్షలు లంచం డిమాండ్ చేశారని ప్రెస్ యజమాని నాంచారయ్య ఏసీబీని ఆశ్రయించారు. అవినీతి నిరోధక శాఖ అధికారుల పథకం ప్రకారం నాంచారయ్య... బ్యాంకు సీఈవోకు డబ్బులు ఇస్తుండగా దాడి చేసి పట్టుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ అదనపు ఎస్పీ సోమంచి సాయికృష్ణ తెలిపారు.
ఇదీ చదవండి: