ETV Bharat / state

పోలీసుల అదుపులో బాలికపై అత్యాచార నిందితుడు

author img

By

Published : Feb 28, 2020, 10:01 AM IST

Updated : Feb 28, 2020, 11:05 AM IST

కృష్ణా జిల్లా నూజివీడులో మూడో తరగతి బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. గాంధీనగర్​కు చెందిన ఓ ఆటోడ్రైవర్ ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తూ అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అన్ని ఆధారాలతో నిందితుడిని పట్టుకున్నట్లు సమాచారం.

nuzivid girl rape case accusued arrest
నూజివీడు బాలిక అత్యాచారం కేసులో పట్టుబడిన నిందితుడు

నూజివీడులో బుధవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో తన తండ్రి కోసం ఇంటికి సమీపంలోని రోడ్డుపై నిలుచున్న మూడో తరగతి బాలికను అగంతుకుడు సైకిల్​పై ఎక్కించుకుని తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం సంఘటనా స్థలంలోనే బాలికను వదిలేసి పరారయ్యాడు. భరించలేని బాధతో బాలిక వేసిన కేకలు విన్న పెట్రోలింగ్ పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనలో నిందితుడిని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ఇవీ చదవండి.. బాలికపై అత్యాచారం.. పరిస్థితి విషమం

Last Updated :Feb 28, 2020, 11:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.