ETV Bharat / state

NARA LOKESH: 'జగన్‌ తన బంధువులను రాబందుల్లా మన్యంపైకి వదిలారు'

author img

By

Published : Jul 10, 2021, 11:44 AM IST

Updated : Jul 10, 2021, 3:01 PM IST

ముఖ్యమంత్రి జగన్‌(CM JAGAN)... తన బంధువులను రాబందుల్లా మన్యంపైకి వదిలి వేడుక చూస్తున్నాని తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజ‌ర్వ్ ఫారెస్ట్‌లో లేట‌రైట్ ముసుగులో బాక్సైట్‌ను త‌ర‌లించటాన్ని తెదేపా బయటపెట్టిందన్న కారణంగానే... నేతలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే బాక్సైట్ మైనింగ్ నిలిపివేసి.. ప‌ర్యావ‌ర‌ణాన్ని, గిరిజ‌నుల హ‌క్కులను కాపాడాలని డిమాండ్ చేశారు.

nara lokesh
nara lokesh

తన తాత ఆస్తిలాగా 15 వేల కోట్ల బాక్సైట్‌ను సీఎం జగన్‌, తన తమ్ముళ్లకి రాసిచ్చారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. బంధువుల్ని రాబందుల్లా మన్యం పైకి వదిలి ముఖ్యమంత్రి వేడుక చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజ‌ర్వ్ ఫారెస్ట్‌లో లాటరైట్‌ ముసుగులో బాక్సైట్‌ తరలించటాన్ని తెదేపా బయటపెట్టిందన్నారు.

విక్రాంత్‌ రెడ్డి, అనిల్‌ రెడ్డి మైనింగ్ మాఫియా కార్యకలాపాలు తెదేపా బ‌య‌ట‌పెట్టిందనే కోపంతోనే సీనియర్‌ నేతల్ని అక్రమంగా అరెస్టు చేయిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే బాక్సైట్ మైనింగ్ నిలిపివేసి.. ప‌ర్యావ‌ర‌ణాన్ని, గిరిజ‌నుల హ‌క్కులను కాపాడాలని లోకేశ్ డిమాండ్ చేశారు.

  • మైనింగ్ డాన్‌ @ysjagan గారూ! బంధువుల్ని రాబందుల్లా మ‌న్యంపైకి వ‌దిలి వేడుక చూస్తున్నారా? మీ ఫ్యామిలీ ప్యాక్ మైనింగ్ మాఫియా దురాగ‌తాలు బ‌య‌ట‌ప‌డ‌కూడ‌ద‌నేనా ప్ర‌తిప‌క్ష నేత‌ల్ని అక్ర‌మంగా అరెస్ట్ చేయించారు?(1/3) pic.twitter.com/ByAOSxPFPD

    — Lokesh Nara (@naralokesh) July 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి:

బచావత్‌ ట్రైబ్యునల్‌ తీర్పుపై సమీక్ష చట్టవిరుద్ధం: కేంద్రానికి ఏపీ లేఖ

Last Updated : Jul 10, 2021, 3:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.