విజయవాడ రాజీవ్ గాంధీ పార్క్ దగ్గర్లో ఉన్న రైల్వే ట్రాక్ సమీపంలో చిన్నపిల్లల ఏడుపు వినిపించడంతో వీరాంజనేయులు అనే వ్యక్తి గుర్తించారు. రైల్వే ట్రాక్ సమీపంలో ఏడాదిలోపు వయసున్న బాలుడిని చూసి రక్షించాడు. చుట్టుపక్కల ఉన్నవారిని బాలుడు గురించి విచారించగా... ఎవరూ తమకు తెలియదని చెప్పటంతో.. చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098కి సమాచారం ఇచ్చి సిబ్బందికి అప్పగించాడు. తాను పూల మార్కెట్కు వెళ్తుండగా.. ఏడుపు వినిపించిందనీ.. చుట్టుపక్కల వెతకగా.. రైల్వే ట్రాక్ దగ్గర బాలుడు ఉన్నాడని వీరాంజనేయులు వివరించారు.
ఇదీ చదవండి: కొవిడ్ రోగుల అవస్థలు.. వార్డుల్లోకి స్నానాల గదుల్లోని నీరు