ETV Bharat / state

'ఆ ఘనత వైకాపా ప్రభుత్వానికే దక్కుతుంది'

author img

By

Published : Jan 30, 2021, 3:18 PM IST

కృష్ణా జిల్లా మచిలీపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని లబ్ధిదారులకు మంత్రులు పేర్నినాని, అనిల్​ కుమార్ యాదవ్ ఇళ్లపట్టాలు పంపిణీ చేశారు. దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా లక్షలాదిమంది నిరుపేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని మంత్రులు వ్యాఖ్యానించారు.

'ఆ ఘనత వైకాపా ప్రభుత్వానికే దక్కుతుంది'
'ఆ ఘనత వైకాపా ప్రభుత్వానికే దక్కుతుంది'

దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా లక్షలాదిమంది నిరుపేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని మంత్రులు పేర్ని నాని, అనిల్‌కుమార్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని లబ్ధిదారులకు మంత్రులు ఇళ్లపట్టాలు పంపిణీ చేశారు. మొత్తం 2 వేల 433 మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు.

గత ప్రభుత్వ హయాంలో పేదలకు సెంటు భూమి కూడా పంపిణీచేయని తెదేపా నాయకులు తమ ప్రభుత్వంపై అవాకులు, చవాకులు పేలటం సిగ్గుచేటని మంత్రులు మండిపడ్డారు. కేవలం పట్టాలతోనే సరిపెట్టకుండా గృహనిర్మాణ బాధ్యతలను కూడా ప్రభుత్వమే చేపడుతోందని మంత్రులు వివరించారు.

ఇదీచదవండి

సీఎం జగన్.. రాష్ట్రాన్ని బీహార్​లా మార్చేశారు: లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.