ETV Bharat / state

కృష్ణా నదిలో స్నానానికి దిగి.. యువకుడి గల్లంతు

author img

By

Published : Jun 22, 2021, 8:35 AM IST

కృష్ణా నదిలో స్నానానికి దిగి యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన కృష్ణలంక శనీశ్వరాలయం పరిసరాల్లో జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సాయంత్రం వరకు గాలించినా ఆచూకీ లభించలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

man missing in riverman missing in river
man missing in river

విజయవాడ కృష్ణలంక శనీశ్వరాలయం పరిసరాల్లో పుష్కర ఘాట్ వద్ద కృష్ణా నదిలోకి ఈతకు దిగి యువకుడు గల్లంతయ్యాడు. అతణ్ని గన్నవరం మండలం ముస్తాబాద్​కి చెందిన రమేష్​గా గుర్తించారు.

విజయవాడలో సర్జికల్ దుకాణంలో పనిచేస్తున్న రమేశ్ తనతో పనిచేస్తున్న రవి, అనిల్ అనే స్నేహితులతో కలిసి వచ్చి సరదాగా నదిలో దిగిన క్రమంలో ఈ ఘటన జరిగింది. స్నేహితులు సమాచారామివ్వగా.. ఎస్డీఆర్ఎఫ్ బృందం గాలింపు చర్యలు చేపట్టింది. అచూకీ లభించలేదు. చీకటి పడడంతో గాలింపు చర్యలు నిలిపేశారు. కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: తాడేపల్లి అత్యాచార ఘటనలో దర్యాప్తు వేగవంతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.