ETV Bharat / state

ఆంధ్రా- తెలంగాణ సరిహద్దులో మద్యం పట్టివేత...

author img

By

Published : May 31, 2020, 10:02 AM IST

కృష్ణా జిల్లాలోని తెలంగాణ - ఆంధ్ర సరిహద్దుల వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో.... అక్రమంగా తరలిస్తున్న 522 మద్యం సీసాలు పట్టుబడ్డాయి. ఈ ఘటనలో పోలీసులు 9 వాహనాలను సీజ్‌ చేసి... 12 మందిపై కేసులు నమోదు చేశారు.

Illicit liquor sieged by krishna district police
Illicit liquor sieged by krishna district police

తెలుగు రాష్ట్రాల మధ్య.. మద్యం ధరలలో భారీగా వ్యత్యాసం ఉండడంతో తెలంగాణ నుంచి అక్రమంగా మద్యాన్ని రవాణా చేసున్నారు. తెచ్చిన మందును రాష్టంలో అధిక ధరలకు అమ్ముకొని జేబులు నింపుకుంటున్న వారిపై.. కృష్ణా జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. సీఐ శ్రీను ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది... తెలంగాణ - ఆంధ్ర సరిహద్దుల వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. తెలంగాణ నుంచి ఆంధ్రాకు అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న 522 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. 9 వాహనాలను సీజ్ చేసి.. 12 మందిపై కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

తిరువూరులో రూ.1.37 కోట్ల నగదు, బంగారం పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.