ETV Bharat / state

ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్​పై.. కేంద్ర మంత్రికి తెదేపా ఫిర్యాదు

author img

By

Published : Aug 5, 2021, 8:50 PM IST

వసంత కృష్ణ ప్రసాద్
వసంత కృష్ణ ప్రసాద్

వైకాపా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్​.. అటవీ చట్టాలను ఉల్లంఘించి కొండపల్లి అటవీ ప్రాంతంలో మైనింగ్​కు పాల్పడుతున్నారని తెదేపా నేతలు ఆరోపించారు. ఈ విషయమై కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్​కు ఫిర్యాదు చేశారు.

కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. అటవీ చట్టాలను ఉల్లంఘించి అక్రమ మైనింగ్ చేస్తున్నారని తెలుగుదేశం నేతలు.. కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్​కు ఫిర్యాదు చేశారు. జీవించే హక్కును కాలరాసే విధంగా ఈ చర్యలు సాగుతున్నాయని.. కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

తెదేపా నియమించిన నిజ నిర్థరణ కమిటీ సభ్యులు నక్కా ఆనంద్ బాబు, వర్ల రామయ్య, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, బోండా ఉమాస కొనకళ్ల నారాయణ, నెట్టెం రఘురామ్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తంగిరాల సౌమ్య, నాగుల్ మీరాలు సంతకాలు చేసిన మూడు పేజీల లేఖను కేంద్ర మంత్రికి పంపారు.

కొండపల్లిలో అక్రమ మైనింగ్​ను అరికట్టడంతో పాటు రాష్ట్రంలో ప్రాథమిక హక్కుల్ని కాపాడేందుకు సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. మైనింగ్ కోసం కొండపల్లి బొమ్మల తయారీకి ప్రసిద్ధి గాంచిన తెల్లపోని చెట్లను నరికి వేయటం బొమ్మల తయారీ జీవనోపాధికి ముప్పని వివరించారు. అక్రమ మైనింగ్​తో ఇప్పటికే 200ఎకరాలకు పైగా అటవీ ప్రాంతాన్ని నాశనం చేశారని పేర్కొన్నారు. ఇదే తీరు కొనసాగితే భవిష్యత్తు తరాలకు తీవ్ర నష్టమని చెప్పారు.

ఇదీ చదవండి:

'టిడ్కో ఇళ్లపై మంత్రి బొత్స చెప్పేవన్నీ అబద్ధాలే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.