ETV Bharat / state

విజయవాడలో పోలీసులకు హెల్మెట్ల పంపిణీ

author img

By

Published : Jan 20, 2021, 9:45 AM IST

రహదారి భద్రత నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటిస్తే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని విజయవాడ సీపీ బి.శ్రీనివాసులు అన్నారు. సుధీక్షన్ ఫౌండేషన్, తానా సంయుక్తంగా పోలీసులకు 100 శిరస్త్రాణాలు పంపిణీ చేశారు.

విజయవాడలో పోలీసులకు హెల్మెట్ల పంపిణీ
విజయవాడలో పోలీసులకు హెల్మెట్ల పంపిణీ

విజయవాడలో సీపీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సుధీక్షన్ ఫౌండేషన్, తానా.. సంయుక్తంగా పోలీసులకు 100 శిరస్త్రాణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ... రహదారి భద్రతా నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. తద్వారా రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని తెలిపారు. 32వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:

'తిరుపతి ఎన్నికల్లో యువత కీలక పాత్ర పోషించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.