Theft: బైక్​పై వచ్చి అడ్రస్​ అడిగారు...ఆ తర్వాత..

author img

By

Published : Sep 15, 2021, 10:17 PM IST

మహిళ మెడలోంచి బంగారు గొలుసు అపహరణ

కృష్ణా జిల్లా పామర్రులో దొంగతనం(theft) జరిగింది. ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు మహిళ మెడలోంచి బంగారు గొలుసు(gold chain)ను లాక్కొని పరారయ్యారు.

కృష్ణా జిల్లా పామర్రు జమ్మిచెట్టు వీధిలో.. ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఓ మహిళను అడ్రస్ అడిగారు. ఆమె చిరునామా చెబుతుండగా దుండగులు మహిళ మెడలో నుంచి 20గ్రాముల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. ఈ ఘటనలో బాధితురాలికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. పట్టపగలే చోరీ జరగటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పామర్రు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి.

Fee: ఫీజు నియంత్రణ జీవోలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.