ETV Bharat / state

వైకాపా తప్పుడు కేసులు పెడుతోంది: వల్లభనేని వంశీ

author img

By

Published : Oct 24, 2019, 6:03 PM IST

వల్లభనేని వంశీ మీడియా సమావేశం

తాను తెదేపాను వీడే ప్రసక్తే లేదని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తేల్చి చెప్పారు. వైకాపా ప్రభుత్వం పెడుతోన్న తప్పుడు కేసులకు భయపడనని స్పష్టం చేశారు.

తెదేపా హయాంలో తన నియోజకవర్గంలో పేదలకు నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చినట్లు తనపై వస్తోన్న వార్తలు నిరాధారమైనవని తెదేపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలిపారు. గన్నవరంలో మాట్లాడిన ఆయన... వైకాపా ప్రభుత్వం ఏర్పడిన 5 నెలల్లో తెదేపా నేతలు, కార్యకర్తలపై ఎన్నో కేసులు పెడుతోందని విమర్శించారు. నిరుపేదలకు పంచిన పట్టాలు రెవెన్యూ శాఖ పర్యవేక్షణలోనే తయారయ్యాయనీ... అలాంటప్పుడు అవి నకిలీవి ఎలా అవుతాయని ప్రశ్నించారు. ఒకవేళ చర్యలు తీసుకోవాల్సి వస్తే తహసీల్దారు, పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలన్నారు. దీనిపై న్యాయస్థానానికి వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నామనీ.. చిన్న చిన్న కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.

వల్లభనేని వంశీ మీడియా సమావేశం

ఇవీ చదవండి..

32 నిమిషాల్లో 72 బాణాలు... చిన్నారి ఆర్చర్ రికార్డు

Intro:Ap_vja_16_24_Gennvaram_Mla_Vallbhanani_Vamsi_pc_Av_Ap10052
Sai babu : 9849803586
యాంకర్ : తేదేపా వేయడం ఉన్నట్లు పలు ప్రసార మాధ్యమాల్లో వస్తున్న ఊహాగానాలకు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ తెర దించారు ... తాను తెలుగుదేశం పార్టీ మారతాననీ వస్తున్న ఊహాగానాలు ఖండించారు.. తనపై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని టిడిపి హయాంలో తన నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో ఉన్న నిరుపేదలకు వారికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా బాపులపాడు, కేసరపల్లి, కొయ్యూరు, perikeedu గ్రామంలో ఇళ్ల పట్టాలు పంచింది వాస్తవమేనని అన్నారు..
రెవిన్యూ శాఖ పర్యవేక్షణలో ఉండే డిజిటల్ సిగ్నేచర్ తో పంచిన ఈ పట్టాలు వాళ్లే తయారు చేయాలి దానికి సంబంధించిన పాస్వర్డ్ కూడా రెవిన్యూ శాఖ వారి పర్యవేక్షణలో తయారు అవుతాయి కాబట్టి ఆ పట్టాలు నకిలీవి ఐ ఉండకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నకిలీ పట్టాల అంశంపై వైకాపాకు చెందిన ఫిర్యాదు దారుడు ఫిర్యాదు చేయడంతో పాటు రెవెన్యూ శాఖకు చెందిన వెబ్ సైట్ ను హ్యాక్ చేసి దానిలో ఈ సంఘటనపై ఏ విధంగా చర్యలు తీసుకోవాలో రెవిన్యూ అధికారులకు సూచించిన విధానం తమ దగ్గర ఆధారాలతో సహా ఉందని, దీనిపై సంబంధిత తాసిల్దారు పోలీసు శాఖ అధికారులను సస్పెండ్ చేయకుండా ఉంటే తాము గవర్నర్కు ఫిర్యాదు చేసి న్యాయస్థానానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే వంశీ ప్రకటించారు. తన మీద ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని చిన్న కేసులకు భయపడే మనస్తత్వం తనకు లేదని ఎమ్మెల్యే వంశీ స్పష్టం చేశారు..

బైట్ : వల్లభనేని వంశీ మోహన్... గన్నవరం నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే..


Body:Ap_vja_16_24_Gennvaram_Mla_Vallbhanani_Vamsi_pc_Av_Ap10052


Conclusion:Ap_vja_16_24_Gennvaram_Mla_Vallbhanani_Vamsi_pc_Av_Ap10052
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.