ETV Bharat / state

రోజుల తరబడి ప్రయాణం... భగవంతుడిపైనే భారం..!

author img

By

Published : Nov 21, 2019, 5:48 AM IST

కడలి అలల పైన.. వలల మాటున పోట్టకూటి కోసం... నిత్యం తిప్పలు తప్పని జీవితాలు. బతుకు తీరం దాటేందుకు... తీరం నుంచి సుదూరం వెళ్లాల్సిందే. ఇంత చేసినా... బతుకు ఒడ్డుకు చేరుతుందన్న నమ్మకం ఉండదు. ఏ గడియలో ఏం జరుగుతుందో తెలియదు. రోజుల తరబడి ప్రయాణం... భగవంతుడిపైనే భారం.. సముద్రంపై అంత నమ్మకంతో బతుకు సాగిస్తున్న గంగపుత్రులపై ప్రత్యేక కథనం.

fishermen problems in divisima

బతుకు తీరం దాటేందుకు.. తీరం నుంచి సుదూరం!

కృష్ణా జిల్లా దివిసీమలోని నాగాయలంక, కోడూరు మండలాల్లో సుమారు 20 వేల మత్స్యకార కుటుంబాలున్నాయి. కృష్ణానది, బంగాళాఖాతంలో వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. నాగాయలంక మండలంలో సంగమేశ్వరం, నాలి, పెదపాలెం, సోర్లగొంది, దీనదయాల్ పురం, పర్రచివర, ఎటిమోగ, గుల్లలమోద, ఎదురుమొండి దీవుల్లో 7 గ్రామాలు, కోడూరు మండలములో విశ్వనాథపల్లె, వేణుగోపాలపురం, సాలెంపాలెం, పాలకాయతిప్ప, ఉల్లిపాలెం, కోడూరు, బసవవానిపాలెం, ఊటగుండం, ఇరాలి గ్రామాల్లో మత్స్యకారులు... ఎక్కువగా కృష్ణానదిలో వేట సాగిస్తారు. కొందరు సముద్రంలో వేట సాగిస్తారు.

కృష్ణా జిల్లా కోడూరు మండలం పాలకాయతిప్ప గ్రామంలో... చేపలు ఎండ బెట్టేందుకు ప్లాట్​ఫారం లేక మత్య్సకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాగాయలంక మండలం, సోర్లగొంది గ్రామంలో నావల దగ్గరకు వెళ్లేందుకు రోడ్డు మార్గం, వీధి లైట్లు లేక నానా అవస్థలు పడుతున్నారు. దివిసీమలోని తీర గ్రామాల్లో లభించిన రొయ్యలు, చేపలను ఆదివారం నాగాయలంక గ్రామంలో జరిగే సంతకి తీసుకొస్తారు. సంతలో గంపకు కేవలం రూ.50 వస్తున్నాయి. లాభం లేకుండా పోతోందని... మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సముద్ర వేటకు కావాల్సిన ఆధునిక సాంకేతికత ఉన్న బొట్లు రాయితీపై అందించాలని... మత్య్సకారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వేటకు వెళ్లినపుడు ప్రమాదంలో గల్లంతైన వారి మృతదేహాలు దొరకకపొతే... డెత్ సర్టిఫికేట్ లేక బీమా సంస్థలు పరిహారం ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి... తమ సమస్యలు పరిష్కరించాలని వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి:సాయి ఎగరేసే కీర్తి పతాకం... చిన్నబోయె కాంగ్రీ పర్వతం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.