ETV Bharat / state

InterState Thieve: అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్..

author img

By

Published : Aug 20, 2021, 7:07 PM IST

అంతర్రాష్ట్ర నగల దొంగను కృష్ణా జిల్లా నూజివీడు పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుడి నుంచి 104 గ్రాముల బంగారం, 570 గ్రాముల వెండి, 5 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.

DSP B Srinivas
డీఎస్పీ బి శ్రీనివాసులు

పలు దొంగతనాల్లో నిందితునిగా ఉన్న అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసినట్లు కృష్ణా జిల్లా నూజివీడులో డీఎస్పీ బి శ్రీనివాసులు తెలిపారు. నూజివీడు సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు.

డీఎస్పీ బి శ్రీనివాసులు

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన దాసరి బాలు ప్రసాద్, అలియాస్ బాలు, అలియాస్ శ్రీనుపై పలు దొంగతనాలకు సంబంధించి అనేక పోలీస్టేషన్లలో కేసులు ఉన్నట్లు తెలిపారు. మొత్తం 16 కేసులలో 104 గ్రాముల బంగారు ఆభరణాలు, 570 గ్రాముల వెండి ఆభరణాలు, 5 మోటార్ సైకిళ్లు, 8 చీరలు, కాపర్ వైరు, కేబుల్ వైరు చోరీలకు పాల్పడినట్లు వివరించారు. వీటి విలువ సుమారు 9,08,500 రూపాయల ఉంటుందని తెలిపారు. నిందితుడిపై కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాల మేరకు ఈ అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసేందుకు పోలీసు సిబ్బంది మూడు టీములుగా కృషి చేసినట్లు తెలిపారు. నిందితుడి అరెస్టు చేయటంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారులు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

ఇదీ చదవండీ.. ఆ ఇళ్లల్లో అంతుచిక్కని ఆగ్ని ప్రమాదం... వస్తువులన్నీ దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.