ETV Bharat / state

కరోనా ఉందనే విషయమే మర్చిపోయారు..!

author img

By

Published : Jun 6, 2020, 11:53 AM IST

కృష్ణా జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కొత్తగా ఎనిమిది పాజిటివ్ కేసులు జిల్లాలో నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 501కి చేరగా... మరో ఇద్దరు కరోనా వైరస్ బారినపడి మృతి చెందారు. జిల్లాలో మొత్తం మృతుల సంఖ్య 22కు చేరింది. కొత్తగా వస్తున్న కేసుల్లో 90 శాతం విజయవాడ నగరంలోనే ఉన్నా... జనంలో మాత్రం అసలు అవగాహనే ఉండడం లేదు. ఆంక్షలు సడలించటంతో నగరంలో రద్దీ పెరిగింది.

corona cases increases in vijayawada
విజయవాడలో పెరుగుతున్న కరోనా కేసులు

కృష్ణా జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మొత్తం కేసుల సంఖ్య 501కి చేరగా... మరో ఇద్దరు కరోనా వైరస్ బారినపడి మృతి చెందారు. జిల్లాలో మొత్తం మృతుల సంఖ్య 22కు చేరింది. తాజాగా వచ్చిన కొత్త కేసుల్లో ఆరు విజయవాడ నగర పరిధిలోనూ, రెండు మచిలీపట్నంలో వెలుగుచూశాయి. విజయవాడలోని కృష్ణలంక, చిట్టినగర్, సింగ్ నగర్​లో కొత్త కేసులు వచ్చాయి. చిట్టినగర్​కు చెందిన 34 ఏళ్ల యువకుడు, కృష్ణలంకకు చెందిన మరో వ్యక్తి కూడా కరోనా వైరస్ సోకటంతో మృతి చెందారు.

పాజిటివ్ కేసుల్లో చికిత్స పొంది ఇప్పటివరకూ 337 మంది ఆసుపత్రి నుంచి ఆరోగ్యవంతులుగా డిశ్ఛార్జై ఇళ్లకు చేరారు. మరో 142 మంది ప్రస్తుతం విజయవాడ, చిన్నఅవుటుపల్లిలోని కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొత్తగా వస్తున్న కేసుల్లో 90 శాతం విజయవాడ నగరంలోనే ఉన్నా... జనంలో మాత్రం అసలు అవగాహనే ఉండడం లేదు. మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. మొత్తం కేసుల్లో విజయవాడ నగరంలోనే 400కు పైగా ఉన్నాయి.

నిత్యం బస్సులు, రైళ్లు, విమానాల్లో ఇక్కడికి చేరుకుంటున్న వారు వేల సంఖ్యలో ఉంటున్నారు. పెద్ద సంఖ్యలో కేసులు నమోదైన కృష్ణలంక, మాచవరం లాంటి ప్రాంతాల్లోనూ జనం చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. రెడ్​జోన్లలోనూ రద్దీ విపరీతంగా ఉంటోంది. ఏప్రిల్ ,మే నెలల్లో అధికంగా కేసులు నమోదయ్యాయి. ఆంక్షలు సడలించటంతో నగరంలో రద్దీ పెరిగింది. ప్రజలు మాత్రం నిబంధనలు పాటించట్లేదని నిపుణులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

ఇదీచూడండి. ఇకపై జేసీలకు బల్క్ అనుమతుల అధికారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.