ETV Bharat / state

పాపం మూగజీవాలు.. వాటి దాహార్తి తీర్చేదెవరు?

author img

By

Published : May 17, 2020, 7:20 AM IST

కృష్ణా జిల్లా నాగాయలంక, కోడూరు మండలాల్లో తాగునీటి కోసం పశువులు ఇబ్బందులు పడుతున్నాయి. వాటి దాహం తీర్చటానికి ప్రభుత్వం నిర్మించిన నీటి తొట్టెల్లో ఎవరూ నీరు నింపని కారణంగా.. అవి దాహానికి అల్లాడిపోతున్నాయి. అధికారులు స్పందించి నీటిని సరఫరా చేయాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.

cattle suffer with water scarcity in krishna district
కృష్ణా జిల్లాలో తాగునీరు కోసం పశువుల అవస్థలు

కృష్ణా జిల్లాలోని నాగాయలంక, కోడూరు మండలాల్లో తాగునీటి కోసం పశువులు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ మండలాల సరిహద్దులో సముద్రం ఉండటం వలన భూగర్బ జలాలు ఉప్పుగా ఉంటాయి. ప్రకాశం బ్యారేజి నుంచి కేఈబీ కాలువ ద్వారా వచ్చే నీటినే పంట సాగుకు... చెరువుల్లో నింపుతూ తాగునీటి అవసరాలకు వినియోగిస్తుంటారు.

వేసవిలో కాలువకు నీరు నిలుపుదల చేసిన కారణంగా... కుళాయిల ద్వారా వచ్చే ఆ కొద్ది నీరు అవసరాలకు పోను.. తాగటానికి చేతి పంపులతో వచ్చే నీటిని వినియోగిస్తున్నారు.

వేసవిలో పశువుల దాహం తీర్చటానికి ప్రభుత్వం నిర్మించిన నీటి తొట్టెల్లో ఎవరూ చుక్క నీరు కూడా నింపకడం లేదు. ఫలితంగా.. పశువులు నీటి కోసం అల్లాడిపోతున్నాయి. పశు సంవర్ధక శాఖ అధికారులు ఇంతకుమందులా ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చి తొట్టెల్లో నింపి పశువుల దాహం తీర్చాలని ఆయా ప్రాంతాల ప్రజలు, పాడి రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

పిడుగు పాటుకు చెట్టు దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.