కృష్ణా జిల్లా నందిగామ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పాత బస్టాండ్ సమీపంలో అతివేగంగా వస్తున్న లారీ, కారును వెనుక నుంచి వచ్చి ఢీకొనడంతో పక్కనే ఉన్న కాలువలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరి మహిళలకు స్వల్ప గాయాలు అయ్యాయి. వారిని వెంటనే 108 అంబులెన్స్ ద్వారా నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిని గుంటూరు జిల్లా రేపల్లే వాసులుగా గుర్తించారు. కారు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈప్రమాదం చోటుచేసుకుంది. లారీ డ్రైవర్ వెంటనే పరారయ్యాడు. నందిగామ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి చదవండి....గమ్యానికి గంటన్నర దూరంలో...మృత్యువు