ETV Bharat / state

నిలిచిన పడవల రాకపోకలు.. లంక గ్రామాల ప్రజలకు తప్పని తిప్పలు

author img

By

Published : Sep 9, 2022, 9:06 PM IST

BOAT STOPPED IN LANKAN VILLAGE : కృష్ణాజిల్లాలో లంక గ్రామస్థులకు తిప్పలు తప్పడం లేదు.. కొంత కాలంగా కురిసిన వర్షాలకు వరదలు వచ్చి.. తమ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిత్యం పడవల్లో ప్రయాణిస్తున్న ప్రజలకు మరోసారి రాకపోకల ఇబ్బందులు తలెత్తాయి. పడవ యజమానులకు డబ్బులు ఇవ్వకపోవడంతో వాళ్లు పడవలు నడిపేందుకు ససేమిరా అంటున్నారు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరద ప్రవాహం గంటగంటకు పెరగడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులు, గ్రామస్థులు ప్రయాణ సౌకర్యాలు లేక పడవ కోసం ఎదురుచూస్తున్నారు. అధికారులు చొరవ తీసుకొని సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.

BOAT STOPPED IN LANKAN VILLAGE
BOAT STOPPED IN LANKAN VILLAGE
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.