ETV Bharat / state

విజయవాడలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రౌండ్ టేబుల్ సమావేశం

author img

By

Published : Nov 12, 2020, 9:18 AM IST

round table meeting was held in Vijayawada
మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రౌండ్ టేబుల్ సమావేశం

మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లింలపై రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు దాడులకు వ్యతిరేకంగా... చర్చించామని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఫారూఖ్ షూబ్లీ తెలిపారు.

మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ముస్లింలపై జరుగుతున్న అత్యాచారాలు దాడులకు వ్యతిరేకంగా... కార్యాచరణ పై చర్చించామని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఫారూఖ్ షూబ్లీ తెలిపారు. సలాం కుటుంబం ఆత్మహత్య పై జేఏసీ ఆధ్వర్యంలో... నంద్యాలలో నిజనిర్ధారణ కమిటీ పర్యటించిందని అన్నారు. ఈ సమయంలో సేకరించిన వివరాలను ప్రభుత్వానికి అందిస్తామని తెలిపారు.

రాష్ట్రంలో ముస్లింలపై జరుగుతున్న దాడులపై ముస్లిలకు న్యాయ సహాయం చేస్తామని అన్నారు. సలాం కుటుంబం ఆత్మహత్య కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. బాధితుడిని వేధించిన సీఐ, హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్ చేయడం కాదు వారిని ఉద్యోగాల్లో నుంచి పూర్తిగా డిస్మిస్ చేయలని డిమాండ్ చేశారు. సలాం కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఎమ్మెల్యే శిల్ప అనుచరుడు శ్రీధర్, జ్యుయాలరి షాప్ కు చెందిన వ్యక్తి వాసు వర్మ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.

ఇదీ చదవండీ...

ఆ 163 మంది శాసనసభ్యులపై నేరాభియోగాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.