ETV Bharat / state

గుంటూరు బ్రాంచ్ కెనాల్​లో గల్లంతైన ఇద్దరి మృతదేహలు లభ్యం

author img

By

Published : Sep 20, 2021, 4:36 PM IST

గుంటూరు బ్రాంచ్ కెనాల్​లో గల్లంతైన ఇద్దరి మృతదేహలు లభ్యం
గుంటూరు బ్రాంచ్ కెనాల్​లో గల్లంతైన ఇద్దరి మృతదేహలు లభ్యం

గుంటూరు బ్రాంచ్ కెనాల్​లో ఆదివారం గల్లంతైన ఇద్దరి మృతదేహలు లభ్యమయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహలను నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లకుంట వద్ద గుంటూరు బ్రాంచ్ కెనాల్​లో గల్లంతైన ఇద్దరి మృతదేహాలు సోమవారం లభ్యమయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరులోని వివిధ ప్రాంతాలకు చెందిన సురేష్, కోటేశ్వరరావు, అశోక్ అనే ముగ్గురు వ్యక్తులు నకరికల్లు మండలం చల్లగుండ్ల గ్రామంలో ఓ వేడుకకు హాజరై తిరుగు ప్రయాణంలో మార్గమధ్యలోని కండ్లకుంట గ్రామం వద్ద స్నానాలు చేసేందుకు గుంటూరు బ్రాంచ్ కెనాల్​లో దిగి గల్లంతరయ్యారు. గమనించిన స్థానికులు సురేష్ మృతదేహాన్ని కాలువ నుంచి వెలికితీశారు.

మిగిలిన ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు కనిపించలేదు. సమాచారం అందుకున్న నకరికల్లు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరి మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం కోటేశ్వరరావు, అశోక్ ల మృతదేహాలు కండ్లకుంట శివారు కాలువలో లభ్యమయ్యాయి. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు... ముగ్గురి మృతదేహాలను పోస్ట్​మార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

ఇదీ చదవండి:
రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.