ETV Bharat / state

తాడేపల్లిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రారంభం

author img

By

Published : Jul 19, 2019, 10:12 PM IST

వాహనాల రద్దీని క్రమబద్దీకరించేందుకు గుంటూరు జిల్లా తాడేపల్లిలో నూతనంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్​ను ఏర్పాటు చేసారు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రులిద్దరు ఒకే మండలంలో ఉండటం వల్ల ట్రాఫిక్ పెరిగందని ఎస్పీ రామకృష్ణ తెలిపారు.

తాడేపల్లిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రారంభం

తాడేపల్లిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రారంభం

గుంటూరులోని తాడేపల్లిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్​ను గుంటూరు అర్బన్ ఎస్పీ రామకృష్ణ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...ముఖ్యమంత్రి జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరు ఒకేచోట ఉండటంతో ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కువయ్యాయని ఆయన తెలిపారు. ఇంతవరకు శాంతి భద్రతలు నిర్వహించే పోలీసులే ట్రాఫిక్ విధుల్లో ఉన్నారని... దీని వల్ల సిబ్బంది కొరత ఏర్పడిందన్నారు. ఈ లోటును తీర్చేందుకు నూతన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి లేఖ రాశామని ఎస్పీ తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే 32 మంది సిబ్బందిని కేటాయించి నూతన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్​ను ఏర్పాటు చేస్తామని వివరించారు.

ఇది చూడండి: వరుణుడితో చిక్కు... నారుమడులకు ట్యాంకర్లే దిక్కు!

Intro:మండలంలోని రెవెన్యూ అధికారులు తనిఖీలుBody:విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం మండల కేంద్రంలో రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం కురుపాం లోని అన్ని హోటల్లో, పెట్రోల్ బంక్ లో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాబాల్లో ఎటువంటి మద్యం అమ్మడం, మద్యం తాగడనికి అనుమతించడం చేయరాదని,అలాగే దాబాలో ఆహారాన్ని నిల్వ ఉంచారదు అని పరిశుభ్రమైన వంట గదిని ఉపయోగించాలని ఆదేశించారు..Conclusion:కురుపాం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.