ETV Bharat / state

TDP Leaders Allegations on Jagan About Krishna Delta: ఎడారిని తలపిస్తోన్న కృష్ణా డెల్టా.. నీళ్లివ్వకపోతే ఆందోళనలు: టీడీపీ నేతలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 13, 2023, 7:24 PM IST

పచ్చని పంటలతో సస్యశ్యామలంగా ఉండే కృష్ణా డెల్టా ప్రాంతం ఇప్పుడు ఎడారిని తలపిస్తోందని తెలుగుదేశం నేతలు ధ్వజమెత్తారు. సాగునీరందక పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పలు చోట్ల టీడీపీ నేతలు పంట పొలాలను పరిశీలించారు. పూర్తి స్థాయిలో పంట పొలాలు ఎండిపోయాయని ఇప్పటికైనా పొలాలకు నీళ్లివ్వకుంటే ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు

tdp_leaders_allegations
tdp_leaders_allegations

TDP Leaders Allegations on Jagan About Krishna Delta: ఎడారిని తలపిస్తోన్న కృష్ణా డెల్టా.. నీళ్లివ్వకపోతే ఆందోళనలు: టీడీపీ నేతలు

TDP Leaders Allegations on Jagan About Krishna Delta:: సస్యశ్యామలంగా ఉండే కృష్ణా డెల్టా ప్రాంతం వైసీపీ పాలనలో ఎడారిని తలపిస్తోందని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్​ ధ్వజమెత్తారు. సాగునీరందక పంటలు ఎండిపోయే పరిస్ధితి నెలకొందన్నారు. అన్నదాతల్ని ఆదుకోలేని ప్రభుత్వం ఉంటే ఎంత.. లేకుంటే ఎంత అని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించకుంటే నాగలిని శిలువగా మోస్తూ రైతుల పక్షాన పోరాటానికి శ్రీకారం చుట్టి తక్షణమే పదవికి రాజీనామా చేస్తా అన్నారు.

వ్యవసాయానికి నీరే ప్రాణాధారం, అలాంటి నీటిని అందించలేని ప్రభుత్వం ఎందుకని మండిపడ్డారు. కృష్ణా నదీ జలాల నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసారు. సాగునీటి కాలువల నిర్వహణ ప్రభుత్వ వైఫల్యంతో రైతులు బలవుతున్నారన్నారు. ప్రభుత్వ చేతకానితనం వల్ల పంట పొలాలకు నీరు అందక రేపల్లె నియోజకవర్గంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని తెలిపారు. నీళ్లు లేక నిజాపట్నం, రేపల్లె, నగరంపాలెం మండలాల్లో పంటలు ఎండిపోతున్నాయని పేర్కొన్నారు.

No Water in Krishna Delta: సాగునీరు అందక ఎండుతున్న పంటలు.. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో రైతుల అవస్థలు..

Bode Prasad Allegations on Jagan: వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులను పూర్తిగా విస్మరించిందని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ విమర్శించారు. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు మండలంలో స్థానిక టీడీపీ నాయకులతో కలిసి పర్యటించిన ఆయన వ్యవసాయ క్షేత్రంలో సందర్శించారు. రైతులను సమస్యలపై అడగ్గా సాగునీరు అందటం లేదని, విద్యుత్ సరఫరాలో అంతరాయం బాగా ఉందని, ఒక ట్రాన్స్​ఫార్మర్​పై అధిక లోడు ఏర్పడటంతో బోర్లు పని చేయక ఇబ్బంది పడుతున్నామన్నారు. విద్యుత్ అధికారులు కూడా సకాలంలో స్పందించకపోవడంతో ఒకటి రెండు రోజులు విద్యుత్ సరఫరా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పలువురు రైతులు మోటార్ సైకిల్​తో పంట పొలంలో నడిపి తమ పరిస్థితిని వివరిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బోడే మాట్లాడుతూ ఇప్పటివరకు ఎప్పుడు చూడనీ అసమర్ధ ప్రభుత్వ పాలన రాజ్యమేలుతుందన్నారు.

Situation Of Krishna West Delta Canals: అధ్వానంగా కృష్ణా పశ్చిమ డెల్టా కాలువలు..నీరు పారేదెలా?

Dhulipalla Narendra Kumar Allegations on Jagan: రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి సంక్షేమ పథకాలలో ఏ విధమైన దోపిడీ చేయాలనే విషయంపై ఉన్న శ్రద్ధ.. రైతులకు సకాలంలో సాగునీరు అందించడంలో లేదని పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం శుద్దపల్లి, సెలపాడు గ్రామాల్లో సాగునీరందక ఎండుతున్న వరి, మిరప పంటలను పరిశీలించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి అధికారాన్ని కట్టబెడితే ఆ అధికారాన్ని అడ్డుపెట్టుకొని సొంతంగా మేలు చేసుకున్నాడే తప్ప ప్రజలకు రైతులకు చేసిన మేలు ఏమీ లేదన్నారు.

Krishna Delta Canals: గుర్రపుడెక్క.. చెత్త చెదారం.. నాలుగేళ్లుగా అదే తీరు

వ్యవసాయం గురించి రైతులు పడుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రిగాని.. స్థానిక శాసన సభ్యుడు గాని పట్టించుకోవడం లేదన్నారు. నాడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టి రైతులకు సకాలంలో నీళ్లు ఇచ్చి సహకరిస్తే నేడు వైసీపీ ప్రభుత్వం రైతులకు సకాలంలో ఎందుకు నీళ్లు ఇవ్వడం లేదో రైతులకు సమాధానం చెప్పాలన్నారు. అధికారులు స్పందించి నీళ్లివ్వకుంటే ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.