case on tdp leaders: తెదేపా నేతలపై మరో కేసు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు

author img

By

Published : Sep 19, 2021, 11:06 AM IST

Updated : Sep 19, 2021, 11:56 AM IST

తెదేపా నేతలపై మరో కేసు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు

11:04 September 19

డీజీపీకి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన తెదేపా నేతలపై కేసులు

తెదేపా నేతలపై తాడేపల్లి పోలీసులు మరో కేసు నమోదు చేశారు. డీజీపీకి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన తెదేపా నేతలపై.. తాడేపల్లి ఏఎస్​ఐ మధుసూదనరావు ఫిర్యాదు చేశారు. డీజీపీ కార్యాలయం గేట్లు నెట్టివేసేందుకు ప్రయత్నించారని ఫిర్యాదు చేశారు. డీజీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దేవినేని ఉమ, నక్కా ఆనందబాబు, కొల్లు రవీంద్ర, అమర్నాథ్‌రెడ్డి, ఆలపాటి రాజేంద్ర, ధూళిపాళ్ల నరేంద్ర, గొట్టిపాటి రవి, డోల బాల వీరాంజనేయస్వామి, ఏలూరి సాంబశివరావు, బోడె ప్రసాద్, తెనాలి శ్రావణ్‌, జీవీ ఆంజనేయులు, నజీర్‍పై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.  

ఇదీ చదవండి: 

CASE ON TDP LEADERS : తెదేపా నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

  • తెదేపా అధినేత ఇంటిపై దాడి యత్నం... కర్రలు, రాళ్లతో టీడీపీ, వైసీపీ నేతల పరస్పర దాడులు
Last Updated :Sep 19, 2021, 11:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.