ETV Bharat / state

NTR STATUE IN DURGI : అందరూ చూస్తుండగా.. ఎన్టీఆర్ విగ్రహంపై దాడి!

author img

By

Published : Jan 2, 2022, 8:23 PM IST

Updated : Jan 3, 2022, 6:12 AM IST

గుంటూరు జిల్లా దుర్గిలో కలకలం రేగింది. పట్టపగలే ఓ వ్యక్తి.. తెదేపా వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించాడు. ఈ ఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. విగ్రహ ధ్వంసానికి యత్నించిన వారిని కఠినంగా శిక్షించాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.

ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసానికి యత్నం
ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసానికి యత్నం

గుంటూరు జిల్లా దుర్గిలో ఓ వ్యక్తి... మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించాడు. దుర్గి మార్కెట్‌యార్డ్ మాజీ ఛైర్మన్ యలమంద కుమారుడు కోటేశ్వరరావు... గ్రామ ప్రధాన రహదారిపై ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని సుత్తితో పగల గొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో విగ్రహం స్వల్పంగా దెబ్బతింది. సమాచారం అందుకున్న దుర్గి ఎస్సై పాల్... కేసు నమోదు చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి.

లోకేశ్ స్పందన...

ఈ ఘటనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. మహనీయుల విగ్రహాలు ధ్వంసానికి ప్రయత్నించడం దారుణమని వ్యాఖ్యానించారు. వైకాపా నేత కోటేశ్వరరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఉద్దేశపూర్వకంగానే దాడి: అచ్చెన్నాయుడు

ఎన్టీఆర్ విగ్రహాన్ని వైకాపా కార్యకర్త ధ్వంసం చేయడాన్ని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తప్పుబట్టారు. ఈ ఘటన మద్యం మత్తులో జరిగింది కాదని, ఉద్దేశపూర్వకంగానే దాడికి పాల్పడ్డారని ఆక్షేపించారు. వైకాపా పాలనలో అరాచకాలకు అడ్డూ, అదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు.

నిందితుడు అరెస్ట్..
ఎన్టీఆర్‌ విగ్రహంపై దాడి ఘటనపై ఎస్పీ స్పందించారు. విగ్రహంపై దాడి చేసిన కోటేశ్వరరావును అరెస్టు చేయాలని సంబంధిత పోలీసులను ఆదేశించారు. ఎస్పీ ఆదేశాలతో నిందితుడిని దుర్గి పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు జరిపి, నివేదిక ఇవ్వాలని గురజాల డీఎస్పీకి ఆదేశించారు.

మరో ఘటనలో..
గుంటూరు జిల్లా తాడికొండలో ఎన్టీఆర్ విగ్రహంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ విగ్రహం వద్ద తెదేపా నేతలు ధర్నా చేపట్టారు.

కావాలనే గ్రామాల్లో అశాంతిని సృష్టిస్తున్నారు: బ్రహ్మానందరెడ్డి

కొందరు కావాలనే గ్రామాల్లో అశాంతి వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మాచర్ల నియోజకవర్గ బాధ్యుడు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. అరాచకాలను ఆపకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఇదీచదవండి :

Last Updated : Jan 3, 2022, 6:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.