ETV Bharat / state

నరసరావుపేటలో మే 3 వరకు సంపూర్ణ లాక్​డౌన్

author img

By

Published : Apr 30, 2020, 9:20 PM IST

కరోనా ఉద్ధృతి దృష్ట్యా నరసరావుపేటలో సంపూర్ణ లాక్​డౌన్​ను పొడిగించారు. మరో మూడు రోజుల పాటు ఆంక్షలు కొనసాగుతాయని జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ వెల్లడించారు. నిత్యావసరాలను ఇళ్లకే పంపిణీ చేస్తామన్నారు. ఎవరైనా బయటకు వస్తే క్వారంటైన్​కు తరలిస్తామని స్పష్టం చేశారు.

narasarao peta
narasarao peta

మీడియాతో కలెక్టర్ శామ్యూల్ ఆనంద్

గుంటూరు జిల్లా నరసరావుపేటలో మరో మూడు రోజుల పాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ తెలిపారు. రెడ్‌జోన్ ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించిన కలెక్టర్... కరోనా కేసులు తగ్గకపోతే లాక్‌డౌన్‌ పొడిగిస్తామని ఉద్ఘాటించారు. వరవకట్టలో కరోనా తగ్గుదలకు పాటించాల్సిన నియమాలను వివరించారు. ప్రజలందరూ లాక్‌డౌన్‌కు సహకరించాలన్న కలెక్టర్ శామ్యూల్‌... నిత్యావసరాలను ఇళ్లవద్దకే సరఫరా చేస్తామని స్పష్టం చేశారు.


ఇదీ చదవండి

ఎంఎస్‌ఎంఈలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.