ETV Bharat / state

రాజాసింగ్‌ కేసులో కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదు.. ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్​

author img

By

Published : Oct 20, 2022, 5:13 PM IST

Highcourt: గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్​పై పీడీ చట్టం ప్రయోగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్​ను హైకోర్టు ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. 28వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని లేకపోతే తగిన నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు తెలిపింది. మరోవైపు రాజాసింగ్​పై నమోదైన పీడీ కేసు విషయంలో అడ్వయిజరీ కమిటీలోని నెలక్రితం వాదనలు ముగిశాయి. అడ్వయిజరీ కమిటీ నిర్ణయం వెలువడాల్సి ఉంది.

Rajasingh
రాజాసింగ్​పై పీడీ చట్టం

High Court on Raja Singh case: రాజాసింగ్​పై నమోదైన పీడీ యాక్ట్ పిటిషన్‌పై హైకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. రాజాసింగ్‌పై నమోదైన కేసులో ఇప్పటివరకు.. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పీడీ యాక్ట్ పెట్టడానికి కారణం చెప్పాలని మరోసారి సర్కారును ధర్మాసనం ఆదేశించింది. వచ్చే విచారణలోగా కౌంటర్ దాఖలు చేయకపోతే ఆర్డర్ ఇస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది.

అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై రాజాసింగ్​పై హైదరాబాద్​ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైలులో ఉన్నారు. మంగళహాట్ పోలీస్​స్టేషన్ పరిధిలో రాజాసింగ్​పై రౌడీషీట్ తెరిచారు. రాజాసింగ్ తరుచూ​ రెచ్చగొట్టే ప్రసంగాలతో ఘర్షణలు చోటు చేసుకునేలా వ్యవహరిస్తున్నారని హైదరాబాద్​ పోలీస్ కమిషనర్​ సీవీ ఆనంద్​ తెలిపారు. ఓ వర్గాన్ని కించపరిచేలా పెట్టిన వీడియో శాంతిభద్రలకు విఘాతం కలిగించిందని పేర్కొన్నారు. 2004 నుంచి ఇప్పటివరకు రాజాసింగ్​పై 101కి పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయని.. 18 కమ్యునల్ కేసులు నమోదైనట్లు ఆయన వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.