ETV Bharat / state

చెత్త తొలగింపు పనులు వేగవంతం చేయాలి: మనోహరనాయుడు

author img

By

Published : Apr 5, 2021, 5:32 PM IST

గుంటూరులోని సంపత్​నగర్ డ్రెయిన్లలో మురుగును తొలగించే పనులను నగర మేయర్ మనోహరనాయుడు పరిశీలించారు. మురుగు కాల్వల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని, పనుల్లో నిర్లక్ష్యం తగదని అధికారులకు సూచించారు.

guntur mayor manoharnaidu inspected to drainage works
గుంటూరు నగర మేయర్ మనోహరనాయుడు

గుంటూరు నగరంలోని మురుగు కాల్వల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించే పనులను వేగవంతం చేయాలని అధికారులను మేయర్ కావటి మనోహరనాయుడు ఆదేశించారు. సంపత్ నగర్​లోని డ్రెయిన్లలో సిల్ట్ తొలగించే పనులను ఆయన పరిశీలించారు. ప్రజారోగ్య అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు సమన్వయంతో పని చేయాలని మేయర్ సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని, మురుగు కాల్వల శుద్ధీకరణ పనుల్లో నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు.

ఇదీచదవండి.

రాష్ట్రంలో కొత్తగా 1,326 కరోనా కేసులు.. 5 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.