ETV Bharat / state

గుట్కాలు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్​..లక్షకు పైగా సరకు స్వాధీనం

author img

By

Published : Jun 26, 2020, 5:47 PM IST

గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం అచ్యుతాపురంలో గుట్కాలు విక్రయిస్తున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. సుమారు లక్ష 70వేలు విలువ చేసే సరకు పట్టుకున్నారు.

guntur dst police raids on gutka selling in nijampatnam mandal
guntur dst police raids on gutka selling in nijampatnam mandal

గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం అచ్యుతాపురం గ్రామంలో గుట్కా అమ్మకాలను పోలీసులు అడ్డుకున్నారు. పక్కా సమాచారంతో ఓ దుకాణంలో అడవులదీవి పోలీసు సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. రూ. లక్ష 70 వేల విలువగల 15 గుట్కా బ్యాగ్ లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

దుకాణం నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. గుట్కా, ఖైనీ అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హరిబాబు హెచ్చరించారు.

ఇదీ చూడండి

శానిటైజర్ల మాటున మాదకద్రవ్యాల సరఫరా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.