Murder Video CC Footage: బీటెక్ విద్యార్థిని దారుణ హత్య.. సీసీ కెమెరాలో దృశ్యాలు!

author img

By

Published : Aug 15, 2021, 8:44 PM IST

Updated : Aug 15, 2021, 9:11 PM IST

murder

గుంటూరు జిల్లాలో బీటెక్ విద్యార్థిని రమ్యను హత్య చేస్తున్న దృశ్యాలు సీసీ పుటేజీలో రికార్డ్ అయ్యాయి. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఆమెను ఓ యువకుడు విచక్షణారహితంగా కత్తితో పొడిచి చంపాడు. అనంతరం ఆ ఉన్మాది ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు.

బీటెక్ విద్యార్థిని దారుణ హత్య... సీసీ కెమరాలో దృశ్యాలు

గుంటూరు జిల్లాలో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య దృశ్యాలు సీసీ పుటేజీలో లభ్యమయ్యాయి. పెదకాకాని రోడ్డులోని పరమాయకుంట వద్ద నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఆమెను ఓ యువకుడు విచక్షణారహితంగా కత్తితో పొడుస్తున్న దృశ్యలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. అక్కడే చాలామంది ఉన్నప్పటికీ ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం విస్మయం కల్గించింది. రమ్య గొంతు, పొట్ట, పొత్తికడుపులో మొత్తం 6 కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. తీవ్ర రక్తస్రావమైన ఆమెను జీజీహెచ్​కు తీసుకువెళ్లేలోగానే మృతి చెందింది. ఘటన తర్వాత ఉన్మాది వేరే మార్గంలో ఉన్న ద్విచక్రవాహనంపై వెళ్లిపోయాడని స్థానికులు తెలిపారు.

ఇదీ చదవండి:

Murder: గుంటూరులో బీటెక్ విద్యార్థిని దారుణ హత్య.. కత్తితో పొడిచిన దుండగుడు

Last Updated :Aug 15, 2021, 9:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.