ETV Bharat / state

గుంటూరు జిల్లాలో దారుణం..మనవడిని హత్య చేసిన తాత

author img

By

Published : Feb 27, 2022, 9:56 PM IST

మనవడిని హత్య చేసిన తాత
మనవడిని హత్య చేసిన తాత

గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో మనవడిని.. తాత హత్య చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

CRIME: గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. బొల్లాపల్లి మండలం లాలిపురంలో మద్యం మత్తులో మనవడిని.. తాత హత్య చేశాడు. ఎస్సై రవీంద్రరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జనపాల శ్రీను నాయక్, తాత సక్రునాయక్​ ఇద్దరూ.. ఇవాళ ఉదయం మద్యం సేవించారు.

మద్యం మత్తులో ఇద్దరు వాగ్వాాదానికి దిగారు. దీంతో.. ఇద్దరి మధ్య ఘర్షణ తీవ్రస్థాయిలో జరగడంతో.. విచక్షణకోల్పోయిన తాత సక్రునాయక్.. మనవడు శ్రీనునాయక్ పై దాడి చేయటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు సక్రునాయక్ పరారీలో ఉన్నాడని, గాలింపు చర్యలు చేపడుతున్నామని పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి :
మా ప్రభుత్వం, మా నిధులు.. అడగడానికి మీరెవరు? : వైకాపా ఎమ్మెల్యే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.