ETV Bharat / state

'గవర్నర్ మాకు అన్యాయం చేశారు... ఇక ఆత్మహత్యలే శరణ్యం'

author img

By

Published : Aug 1, 2020, 11:35 AM IST

రాష్ట్ర గవర్నర్​ తమను మోసగించారని అమరావతి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్​ ఆమోదం తెలపడాన్ని వారు తప్పుబట్టారు. ఇక తమకు ఆత్మహత్యలే శరణ్యమని కన్నీటి పర్యంతమయ్యారు.

amaravati farmers
amaravati farmers

పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను గవర్నర్ ఆమోదించటంపై రాజధాని రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. రాష్ట్ర గవర్నర్ తమను మోసగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రెండు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపారంటూ ప్రసారమాధ్యమాల్లో వచ్చిన వెంటనే వారంతా రోడ్లపైకి వచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ప్రజాభిప్రాయాన్ని, న్యాయనిపుణుల సలహాలను తీసుకోకుండానే రాజ్యాంగ పదవిలో ఉండి ఈ నిర్ణయం ఎలా తీసుకుంటారని రైతులు ప్రశ్నించారు. ఇక తమకు ఆత్మహత్యలే శరణ్యమని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని చెప్పారు.

అమరావతి రైతుల ఆందోళన

ఇదీ చదవండి

గవర్నర్ నిర్ణయం చారిత్రక తప్పిదం: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.