వైఎస్సార్‌ సున్నా వడ్డీ రాయితీ.. దక్కేది ఎందరికి..?

author img

By

Published : Dec 1, 2022, 7:01 AM IST

Updated : Dec 1, 2022, 9:41 AM IST

Zero Interest Scheme

Funding Details of 'YSR Zero Interest' Scheme: వైసీపీ పాలనలో సున్నా వడ్డీ పథకం తీరు.. పేరు గొప్పు-ఊరు దిబ్బ అన్నట్లుగా మారింది. పంట రుణాలపై సున్నా వడ్డీ అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా..80శాతం మందికి ఆ ఫలాలు దక్కడం లేదు. లోపం ఎక్కడ?, ఎందుకు అధిక శాతం రైతులు అర్హత సాధించలేకపోతున్నారనే విషయాలు ప్రభుత్వానికి పట్టడం లేదు. లక్ష నుంచి 3 లక్షల వరకు ఉన్న పంట రుణాలపై గతంలో పావలా వడ్డీ పథకమైనా వర్తించేది. వైసీపీ ప్రభుత్వం ఆ పథకానికి మంగళం పాడింది. పైగా సున్నా వడ్డీ కింద ఏడాదికి 3వేల కోట్ల వరకు ఇవ్వాల్సి ఉంటుందని..2019 జులైలో సీఎం జగన్‌ అసెంబ్లీలో చెప్పారు. కానీ నిధులు మాత్రం కేటాయించడం లేదు.

2014-15 నుంచి 2018-19 వరకు రైతులు తీసుకున్న పంట రుణాలపై 4% సున్నా వడ్డీ లెక్కిస్తే రూ.11,595 కోట్లు కట్టాలి. అదే విధంగా 2019-20 నుంచి 2021-22 వరకు రాష్ట్రంలో భూమిపై తీసుకున్న రూ.1,46,261 కోట్ల పంట రుణాలకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ 4% లెక్కిస్తే.. రూ.5,850 కోట్లు చెల్లించాలి. కానీ.. ఇప్పటివరకు ఇచ్చింది రూ.1,834.55 కోట్లే. ఇందులో గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలుగా రూ.1,180 కోట్లని పేర్కొన్నారు. అంటే.. 2021 ఖరీఫ్‌ వరకు తీసుకున్న రుణాలకు ఇచ్చిన వడ్డీ రాయితీ కేవలం రూ.654 కోట్లే.

2019 జులై 12న అసెంబ్లీలో సీఎం జగన్‌ చెప్పిన లెక్కలు

రైతుల కోసం వైఎస్సార్‌ సున్నా వడ్డీ అనే కొత్త పథకం తెచ్చాం. గతంలో ఇదెప్పుడూ లేదు. సున్నా వడ్డీకి రుణాలివ్వాలని ఆలోచన చేసిన నాథుడే లేరు. పంట రుణాలు తీసుకున్న రైతులు గడువులోగా చెల్లిస్తే.. ఆ రుణాలపై ఎలాంటి వడ్డీ కట్టాల్సిన పనిలేదు.

2019 జులై 8న జమ్మలమడుగులో జరిగిన రైతు దినోత్సవంలో సీఎం జగన్‌

వాస్తవం ఇదీ..

నిజానికి సున్నా వడ్డీ కొత్త పథకం కాదు. ఉమ్మడి రాష్ట్రంలోనూ సున్నా వడ్డీ, పావలా వడ్డీ పథకాలున్నాయి. వైకాపా వచ్చాక ‘పావలా వడ్డీ’కి మంగళం పాడింది.

వైసీపీ ప్రభుత్వ పాలనలో సున్నా వడ్డీ పథకం పని తీరు

Funding Details of 'YSR Zero Interest' Scheme: 2019 జులై 8న జమ్మలమడుగులో.. మే 26 2022న .. సున్నా వడ్డీ పథకం గురించి సీఎం చెప్పిన మాటలు. అలాగే 2019 జులై 12 అసెంబ్లీలోనూ సీఎం జగన్‌ సున్నా వడ్డీ పథకంపై ప్రసగించారు. 2014-15 నుంచి 2018-19 వరకు రైతులు తీసుకున్న పంట రుణాలపై 4శాతం సున్నా వడ్డీ లెక్కిస్తే 11 వేల 595 కోట్లు కట్టాలన్నారు. అదే విధంగా 2019-20 నుంచి 2021-22 వరకు రాష్ట్రంలో భూమిపై తీసుకున్న లక్షా 46 వేల 261 కోట్ల పంట రుణాలకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ 4శాతం లెక్కిస్తే.. 5 వేల 850 కోట్లు చెల్లించాలని చెప్పారు. కానీ.. ఇప్పటివరకు ఇచ్చింది 18 వందల 34.55 కోట్లే అని అన్నారు. ఇందులో గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలుగా 11 వందల 80 కోట్లని పేర్కొన్నారు. అంటే.. 2021 ఖరీఫ్‌ వరకు తీసుకున్న రుణాలకు ఇచ్చిన వడ్డీ రాయితీ కేవలం 654 కోట్ల రూపాయలేనని చెప్పారు.

వాస్తవానికి రాష్ట్రంలో ఏటా భూమిపై పంట రుణాలు తీసుకునే రైతులు 52 లక్షలకు పైగా ఉంటున్నా.. వారిలో 10 లక్షల మంది కూడా లబ్ధి పొందలేకపోతున్నారు. పంట రుణాలపై సున్నా వడ్డీ 20శాతం మందికే దక్కుతోంది. ఏటా 3వేల కోట్లు చెల్లిస్తామని సీఎం చెప్పినా.. 2019-20లో 418 కోట్లు విడుదల చేశారు. 2020-21 ఏడాదికి 158 కోట్లే ఇచ్చారు. 2021-22లో ఖరీఫ్‌ వరకు ఇచ్చింది 115 కోట్లే. అలాగే సున్నా వడ్డీ కొత్త పథకం కాదు. ఉమ్మడి రాష్ట్రంలోనూ సున్నా వడ్డీ, పావలా వడ్డీ పథకాలున్నాయి. వైసీపీ వచ్చాక ‘పావలా వడ్డీ పథకాన్ని ఎత్తేసింది.

గణాంకశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం రైతుల సంఖ్య 85 లక్షల14 వేలు. వారిలో 2.5 ఎకరాల్లోపు భూమి ఉన్నవారు 69శాతం. అయిదెకరాల్లోపు రైతులు 75.5 లక్షలు. సున్నా వడ్డీ అర్హుల సంఖ్య 2020-21 సంవత్సరంలో 10 లక్షలు కూడా లేదు. మూడేళ్లుగా పంట ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, రైతుల పరిస్థితి బాగుందని చెబుతున్న ప్రభుత్వం ఎక్కువ మందికి సున్నా వడ్డీ ఎందుకు వర్తించడం లేదనే అంశంపై దృష్టి సారించడం లేదు. సున్నా వడ్డీ పంట రుణాలకు అర్హతను పదేళ్ల కిందట ప్రకటించిన విధంగా లక్ష వరకే కొనసాగిస్తున్నారు. పథకంతో అధిక శాతం మందికి ప్రయోజనం పొందాలంటే 2 లక్షల రుణం వరకు వర్తింపజేయాలని రైతులు అభిప్రాయపడుతున్నారు.

పంటరుణంపై అసలు బ్యాంకులు వసూలు చేసే వడ్డీ 9శాతం. ఇందులో ఏడాదిలోగా రుణం చెల్లిస్తే కేంద్రం ఇచ్చే 5శాతం రాయితీ వర్తిస్తుంది. రైతుల వాటా 4శాతం. ప్రభుత్వాలు రాయితీ ప్రకటిస్తే ఈ 4 శాతం తగ్గుతుంది. గతంలో లక్ష వరకు పంట రుణం తీసుకుని ఏడాదిలోపు చెల్లిస్తే వడ్డీ లేని రుణాలు పథకం కింద రైతు కట్టాల్సిన 4శాతం వడ్డీని బ్యాంకర్లు మినహాయించేవారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకునేవారు. 1 లక్ష నుంచి 3 లక్షల వరకు తీసుకుని ఏడాదిలోపు చెల్లిస్తే అందులో ‘పావలా వడ్డీ’ కింద 1శాతం వడ్డీని ప్రభుత్వం ఇచ్చేది. 3శాతం రైతులు చెల్లించేవారు.

వడ్డీ లేని రుణాలు పథకాన్నే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ’ పథకంగా అమలు చేస్తోంది. లక్ష వరకు రుణాలు తీసుకున్న రైతులకు వర్తింపజేస్తోంది. అదీ.. ఏడాదిలోపు వడ్డీతో సహా చెల్లించిన రైతుల పేర్లను బ్యాంకర్ల నుంచి తీసుకుని ఆ తర్వాత వారి ఖాతాల్లో ప్రభుత్వం వడ్డీ జమ చేస్తోంది. కానీ.. అధిక శాతం మంది రైతులు తమకు సున్నా వడ్డీ జమ కావడం లేదనే చెబుతున్నారు. అలాగే లక్ష నుంచి 3 లక్షల పంటరుణం తీసుకొని ఏటా చెల్లించే వారికి వడ్డీల భారం తప్పడం లేదు.

ఈ-క్రాప్‌ నమోదు చేయించుకోకపోతే సున్నా వడ్డీ రాయితీ రావడం లేదు. ఈ-క్రాప్‌లో నమోదైన పంటకు కాకుండా.. వేరే పంటకు రుణం తీసుకున్నా రాయితీ రావడం లేదు. లక్షపైన రుణం తీసుకున్నా వడ్డీ ఇవ్వరు. మూడున్నర ఎకరాల వరి, వేరుసెనగ వేసిన రైతులు లక్షపైగా రుణం తీసుకున్నా.. సున్నా వడ్డీ లభించడం లేదు. అలాగే బ్యాంకులు ప్రభుత్వాలకు సమయానికి రైతుల పేర్లు పంపడం లేదనే ఆరోపణలూ ఉన్నాయి.

ఇవీ చదవండి:

Last Updated :Dec 1, 2022, 9:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.