ETV Bharat / state

Farmers Suffering Due to Lack of Irrigation Water: వరిపైరుకు అందని సాగునీరు.. అల్లాడుతున్న రైతులు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 3, 2023, 4:40 PM IST

Farmers are suffering due to lack of irrigation water: వర్షాభావ పరిస్థితులతో... కృష్ణా పశ్చిమ డెల్టా ప్రమాదంలో పడుతోంది. కాలువలకు నీటి విడుదల సరిగా లేకపోవటంతో వరిపైరు వాడిపోతోంది. ముఖ్యంగా చివరి ఆయకట్టు పొలాలు నెర్రెలు రావటంతో పరిస్థితి దారుణంగా కనిపిస్తోంది. కీలక సమయంలో పొలాలకు నీరు అందకపోవటంతో ఏమవుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పెట్టిన పెట్టుబడంతా.. బూడిదలో పోసిన పన్నీరై పోతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

farmers_are_suffering_due_to_lack_of_irrigation_water
farmers_are_suffering_due_to_lack_of_irrigation_water

Farmers are suffering due to lack of irrigation water: వరిపైరుకు అందని సాగునీరు.. అల్లాడుతున్న రైతులు

Farmers Suffering Due to Lack of Irrigation Water for Crops: కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కొనసాగుతున్న వర్షాభావంతో జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటాయి. పట్టిసీమ, పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజిని నింపి అరకొరగా కాలువలకు విడుదల చేస్తున్నారు. అయితే అందిస్తున్న నీరు ఆయకట్టుకి సరిపోవడం లేదు. గుంటూరు జిల్లాలో 60వేల హెక్టార్లు, బాపట్ల జిల్లాలో లక్షా 9వేల ఎకరాలు వరి పంట సాగు చేశారు. వరి పంట 25రోజుల నుంచి 40రోజుల దశలోనే ఉంది. నీరు లేక పంటలు ఎండిపోతుంటే గుండె తరుక్కు పోతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మోటార్ల సాయంతో మురుగు కాలువల్లో ఉన్న నీటితో పొలాలను తడుపుతున్నారు. సాగునీటి కాలువలకు పూర్తిస్థాయిలో నీరు రాకపోతే మురుగుకాల్వలోనూ నీటి లభ్యత తగ్గిపోతుంది. పంట వంద రోజుల దశకు వచ్చినప్పుడు నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో నీరు అందకపోతే దిగుబడులపై తీవ్ర ప్రభావం పడుతోందని రైతులు వాపోతున్నారు.

Rayalaseema Farmers Waiting For HNSS Water: హంద్రీనీవాకు పారని సాగునీరు.. రైతు కంట పారుతున్న కన్నీరు

Current Water Wells in Pulichintala Project: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుతం 20.88 టీఎంసీలు నీటినిల్వలు ఉన్నాయి. ఇక్కడి నుంచి 3వేల క్యూసెక్కుల చొప్పున ప్రకాశం బ్యారేజీకి విడుదల చేస్తున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి 7వేల క్యూసెక్కులు తోడి పోస్తుండగా ప్రకాశం బ్యారేజీకి చేరేసరికి 5500 క్యూసెక్కులు వస్తున్నాయి. కృష్ణా పశ్చిమ డెల్టా కాలువకు 3700 క్యూసెక్కులు నీరు విడుదల చేస్తున్నారు. కృష్ణా పశ్చిమ డెల్టాలో సింహభాగం వెద పద్ధతిలో వరి పంట సాగు చేయడంతో అందరికీ ఒకేసారి సాగునీరు అవసరమవుతోంది. దీనికితోడు ఎండలు 38 డిగ్రీల వరకు ఉండటంతో నీటి అవసరాలు పెరిగాయి. డెల్టా ప్రధాన కాలువకు 3700 క్యూసెక్కులు మాత్రమే విడుదల చేస్తుండటంతో బ్రాంచ్‌ కాలువలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందడం లేదు.

Kandaleru Reservoir: నెల్లూరు కనుపూరు కాలువల్లో ఆగిన సాగునీరు..అన్నదాతకు కన్నీరు

Branch Canals are not Fully Irrigated: ప్రధాన కాలువలో 5వేల క్యూసెక్కులు దాటితేనే పెదవడ్లపూడి వద్ద విడిపోయే హైలెవల్‌ కెనాల్‌కు నీరు అందుతోంది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవటంతో కాలువ పరిధిలోని ఆయకట్టు చివరిభూములకు సాగునీరు అందడం లేదు. రైతులు ఇప్పటికే ఎకరాకు రూ.10 నుంచి 12వేల వరకూ పెట్టుబడులు పెట్టారు. కౌలు రూపంలో 20 నుంచి 25 వేల రూపాయలు చెల్లించారు. వెదపద్ధతిలో సాగుచేసిన పంటలో కలుపు నివారణకు రసాయనాలు పిచికారీ చేసిన రెండురోజులకు సాగునీరు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు నీరు అందకపోతే పంటలు వెంటనే ఎండిపోతాయి. ఈ నేపథ్యంలో కలుపు మందులు చల్లాలా వద్దా, ఎరువులు వేయాలా వద్దా అన్న సందిగ్ధంలో రైతులున్నారు. కొత్తగా పెట్టుబడులు పెడితే ఆ తర్వాత నీరు రాకపోతే మొదటికే మోసం వస్తుందని ఆందోళన చెందుతున్నారు. దీంతో కర్షకులు ఏంచేయాలో తోచని స్థితిలో ఉన్నారు.

Lift irrigation: నిరుపయోగంగా ఎత్తిపోతల పథకాలు..సాగునీరు అందక రైతుల అవస్థలు

No Availability of Water in Reservoirs on Krishna River: కృష్ణానదిపై ఉన్న జలాశయాల్లో నీటిలభ్యత తక్కువగా ఉన్నందున సాగునీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు చెబుతున్నారు. వారబందీ విధానంలో సాగునీరు అందించడానికి ప్రణాళికలు వేస్తున్నారు. ఇప్పటికే సాగవుతున్న వరి పంటకు నీరు అందిస్తామని మిగిలిన పొలాల్లో ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచిస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల స్థాయిలో కర్షకులకు అవగాహన కల్పిస్తామని నీటిపారుదలశాఖ గుంటూరు సర్కిల్ ఎస్.ఈ ఉమామహేశ్వరరావు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.