ETV Bharat / state

Electricity Charges Burden on Industries in Andhra Pradesh: విద్యుత్​ భారాన్ని మోయలేక విలవిలలాడుతున్న పరిశ్రమలు..

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 4, 2023, 8:43 AM IST

Electricity_Charges_Burden_on_Industries_in_Andhra_Pradesh
Electricity_Charges_Burden_on_Industries_in_Andhra_Pradesh

Electricity Charges Burden on Industries in Andhra Pradesh: వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని రంగాలను జలగల పట్టి పీల్చుకు తింటోంది. చివరకి పరిశ్రామిక రంగాన్నీ వదలటం లేదు. నేరుగా ఛార్జీలను విధించకున్న వివిధ సుంకలు, పన్నులు, ఛార్జీల రూపంలో భారాన్ని పరిశ్రమల నెత్తిన ఎత్తుతోంది. ఈ కోవలకే విద్యుత్​ భారం

Electricity Charges Burden on Industries in Andhra Pradesh: విద్యుత్​ భారాన్ని మోయలేక విలవిలలాడుతున్న పరిశ్రమలు..

Electricity Charges Burden on Industries in Andhra Pradesh: వైసీపీ ప్రభుత్వం వడ్డిస్తున్న విద్యుత్‌ భారాన్ని మోయలేక రాష్ట్రంలోని పరిశ్రమలన్నీ కుదేలవుతున్నాయి. పరిశ్రమలపై ఛార్జీల భారం వేయబోమంటూనే వివిధ రకాల ఛార్జీల పేరుతో యూనిట్‌కు 2.19 పెంపుతో.. ఒక మోస్తరు పరిశ్రమలపై నెలకు 4.18 లక్షల భారం మోపుతోందని గగ్గోలు పెడుతున్నాయి. చిన్న పరిశ్రమలనూ వదలకుండా బాదేస్తున్నారని మండిపడుతున్నాయి. ఫలితంగా ఇప్పటికే 20 శాతం పరిశ్రమలు మూతపడ్డాయని.. పరిస్థితి ఇలానే కొనసాగితే మిగిలి ఉన్న వాటి నిర్వహణ సైతం కష్టమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పారిశ్రామిక వర్గాలు.

విద్యుత్‌ సుంకం, ట్రూ అప్‌, ఇంధన సర్దుబాటు ఛార్జీలు.. ఇలా నాలుగేళ్లలో పరిశ్రమలపై ప్రభుత్వం వేసిన అదనపు ఛార్జీల భారాలకు ప్రభుత్వం పెట్టిన పేర్లు ఇవి. ఏ చిన్న కష్టం వచ్చిన సరే పరిశ్రమలకు ఫోన్‌కాల్‌ దూరంలోనే తమ ప్రభుత్వం ఉంటుందని హామీ ఇచ్చిన సీఎం జగన్‌.. పారిశ్రామిక సంఘాలు విద్యుత్‌ సుంకాన్ని తగ్గించండి మహాప్రభో అని మొర పెట్టుకున్న ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు.

ఛార్జీల భారాన్ని తగ్గించకపోతే పరిశ్రమలు మూతపడటం మినహా మరో గత్యంతరం లేదని పారిశ్రామికవేత్తలు గోడు వెళ్లబోసుకున్నా ‘చెవిటివాడి ముందు శంఖం ఊదిన’ సామెత లాగా పరిస్థితి తయారైంది. విద్యుత్‌ కోతల కారణంగా పరిశ్రమలు గత రెండేళ్లుగా ఉత్పత్తి నష్టాలను చవిచూశాయి. రాష్ట్రంలో కరోనా ప్రభావం, విద్యుత్‌ వడ్డన భారంతో.. 20 శాతం పరిశ్రమలు మూతపడ్డాయని పారిశ్రామిక సంఘాలు చెబుతున్నాయి.

Tax Increase: వరుస పన్నుల బాదుడుతో బెంబేలెత్తుతున్న విజయవాడ వాసులు

Heavy Power Charges on Industries in AP: వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమలకు నేరుగా ఛార్జీలను పెంచకున్నా వివిధ రూపాల్లో ఛార్జీల మోత మోగించింది. ఒక మోస్తరు పరిశ్రమపై ప్రతి నెలా 4.18 లక్షల భారం పడింది. వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్‌ వినియోగదారులకు యూనిట్‌కు 6 పైసలుగా ఉన్న విద్యుత్‌ సుంకాన్ని 2022 మే నుంచి యూనిట్‌కు ఏకంగా రూపాయికి పెంచింది. వాటిని భరించే స్థితిలో పరిశ్రమలు లేవని, సుంకాన్ని తగ్గించాలని పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేదు.

2022 ఆగస్టు నుంచి ట్రూఅప్‌ పేరుతో యూనిట్‌కు 22 పైసలు, 2021-22లో వినియోగించిన విద్యుత్‌కు ఇంధన సర్దుబాటు ఛార్జీల కింద 2023 ఏప్రిల్‌ నుంచి యూనిట్‌కు 63 పైసల అదనపు భారం వేసింది. 2023-24లో ఎఫ్‌పీపీసీఏ కింద యూనిట్‌కు 1.10 వంతున వసూలు చేసుకోవడానికి అనుమతించాలని డిస్కంలు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలికి ప్రతిపాదించాయి. అందులో యూనిట్‌కు 40 పైసల చొప్పున గత ఏప్రిల్‌ నుంచి వసూలు చేస్తున్నాయి. మిగిలిన 70 పైసలు ఏడాది చివర్లో ట్రూఅప్‌ కింద వసూలు చేసే అవకాశం ఉంది. ఇలా జగన్‌ ప్రభుత్వం నాలుగేళ్లలో పరిశ్రమలపై యూనిట్‌కు 2.89 భారాన్ని వేసింది.

పన్ను తగ్గించండి..రాష్ట్ర వ్యాప్తంగా లారీ అసోసియేషన్ యజమానుల ధర్నా

Heavy Power Charges on Industries in AP: ట్రూఅప్, ఎఫ్‌పీపీసీఏల పేర్లతో ప్రభుత్వం వేసిన విద్యుత్‌ ఛార్జీల భారాలతో పరిశ్రమల ఉత్పత్తి వ్యయంపై సుమారు 26 శాతం ప్రభావం పడింది. సాధారణంగా ఇంజినీరింగ్, తయారీ వంటి కొన్ని రకాల పరిశ్రమల్లో విద్యుత్‌ ఖర్చు 20 శాతం ఉంటుంది. ఫర్నేస్‌ ఆధారంగా మెల్టింగ్‌ చేసే ఫౌండ్రీలు, స్పిన్నింగ్‌ మిల్లులు వంటి వాటిలో 40శాతం ఫెర్రో ఎల్లాయిస్‌ పరిశ్రమల్లో 60 శాతం వరకు విద్యుత్తే ముడిసరకు. ప్రభుత్వం వేసిన అదనపు భారాలతో ఈ తరహా పరిశ్రమలన్నీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నాయి.

ఇప్పటికే ఫెర్రో ఎల్లాయిస్‌ పరిశ్రమలు మూతపడ్డాయి. సాధారణంగా పరిశ్రమలు ఇప్పుడున్న విద్యుత్‌ టారిఫ్‌ ప్రకారమే కొటేషన్‌ ఇస్తాయి. ఆర్డర్‌ తీసుకున్నప్పటి నుంచి పని పూర్తి చేయడానికి 3, 4 నెలలు పడుతుంది. ఈలోపు అదనపు భారాలు పడ్డాయంటే లాభానికి బదులు నష్టపోవాల్సి వస్తోంది.

గతంలో వినియోగించిన విద్యుత్‌కు ప్రస్తుతం అదనపు ఛార్జీలు విధించటంతో పరిశ్రమలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఎప్పుడో వాడిన విద్యుత్‌కు ఇప్పుడు బిల్లులు వసూలు చేయడానికి బదులు.. విద్యుత్‌ టారిఫ్‌ రెండు సంవత్సారలకు ఓ సారి సమీక్షించి సవరించిన కూడా పరవాలేదని పారిశ్రామిక వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఆ రకంగా మరో రెండు సంవత్సరాలపాటు ఛార్జీల పెంపు ఉండదని ప్రభుత్వం హామీ ఇస్తే ఆ వ్యవధిలో వస్తు తయారీ ధరను నిర్ణయించి సరఫరా చేయడానికి వెసులుబాటు ఉంటుందని చెబుతున్నాయి.

Left Parties Protest to Reduce the Electricity Charges: పెంచిన విద్యుత్​ ఛార్జీలు తగ్గించాలని వామపక్షాల ఆందోళన

Heavy Power Charges on Industries in AP: ఆ ఛార్జీల ప్రకారం సరఫరా చేయడం కుదరదని భావిస్తే కొటేషన్‌ ఇవ్వడమే మానుకుంటాయి. గిట్టుబాటు కాదంటే అవసరమైతే పరిశ్రమలో ఉత్పత్తి నిలిపేస్తాయి. పరిశ్రమలకు కరెంటు ఛార్జీలు అధికంగా ఉన్నాయని, మరింత పెంచితే పరిశ్రమలు మూతపడే ప్రమాదం ఉందని చెబుతూనే ప్రభుత్వం చెబుతూనే వాటిపై ఛార్జీల భారాన్ని వేసింది.

విద్యుత్‌ ఛార్జీల పెంపు కారణంగా కేవలం 5 నుంచి 10 శాతం లాభాలతో నడిచే పరిశ్రమలు నష్టాల్లోకి వెళితే.. ఒకటి రెండేళ్లలోనే అవి మూతపడే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త పరిశ్రమలు ఎలా వస్తాయి? ఎంఎస్‌ఎంఈలు మూతపడటానికి విద్యుత్‌ ఛార్జీల అదనపు భారమే ప్రధాన కారణం. విజయవాడ ఆటోనగర్‌లో 35 నుంచి 40 శాతం చిన్న పరిశ్రమలు అద్దె షెడ్లలో నడుస్తున్నాయి.

గతంలో ఎవరో వాడుకున్న విద్యుత్‌కు ఇప్పుడు అదనపు భారాన్ని ఎందుకు భరించాలంటూ చిన్న యూనిట్లు మూసేస్తున్నారు. కొత్తగా ఎవరైనా రావాలన్నా విద్యుత్‌ ఛార్జీలను చూసి భయపడుతున్నారు. కొవిడ్‌ తర్వాత పరిశ్రమల్లో పనిచేయడానికి నిపుణులైన సిబ్బంది దొరకడం లేదు. దీని ప్రభావంతో రోజుకు 150 టన్నులు ఉత్పత్తి చేసే పరిశ్రమలో 80-90 టన్నుల ఉత్పత్తికే పరిమితమవుతున్నామని పరిశ్రమ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ కారణంగా స్థిర ఛార్జీల భారం పెరిగి, ఉత్పత్తి వ్యయంపై ప్రభావం పడుతోంది.

Power Subsidy In AP: రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులపై బాదుడే బాదుడు

Heavy Power Charges on Industries in AP: వర్క్‌ ఆర్డర్‌ తీసుకున్న తర్వాత ట్రూఅప్, ఎఫ్‌పీపీసీఏల పేరుతో అదనపు భారాన్ని ప్రభుత్వం మోపుతోందన్న పరిశ్రమల నిర్వాహకులు... ఓసారి ఆర్డర్‌ తీసుకున్నాక ఛార్జీలు పెరిగాయంటే వినియోగదారులు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఆర్డర్లు తీసుకునే వారి నుంచి ట్రూఅప్, ఎఫ్‌పీపీసీఏ ఛార్జీలను సర్దుబాటు చేద్దామనుకుంటే ఎప్పుడో వాడుకున్న విద్యుత్‌కు పడే అదనపు ఛార్జీలకు మాకు సంబంధమేంటని అడుగుతున్నారని వాపోతున్నారు. అలాంటప్పుడు అప్పట్లో వస్తువులు సరఫరా చేశామని.. దానికి దామాషా ప్రకారం ప్రభుత్వం వసూలు చేసే అదనపు విద్యుత్‌ ఛార్జీలను వసూలు చేసుకోవడం కూడా సాధ్యం కాదని.. ఆ నష్టాన్ని పరిశ్రమల నిర్వాహకులే భరించక తప్పదని స్పష్టం చేస్తున్నారు.

"ఈ రోజు ఇండస్ట్రీలు మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బిల్లులో వచ్చిన ఛార్జీలకు వాళ్లు విధించిన ఛార్జీలకు ట్యాలీ కావటం లేదు. ట్రూ అప్​ ఛార్జీలు వంటివి రద్దు చేయాలి. సోలార్​ సిస్టం లాంటివి పెట్టుకుంటే ప్రభుత్వానికి విద్యుత్​ అందిస్తే రిఫండ్​ ఇచ్చేది.. ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వను అంటోంది." -వినోద్‌బాబు ఐలా ఛైర్మన్‌

గతంలో కోళ్ల ఫారాల నిర్వాహకులు యూనిట్‌కు 3.85 వంతున ఛార్జీలను చెల్లించేవారు. ఇప్పుడు ఫీడ్‌ తయారు చేసుకునే ప్లాంట్లు ఉన్నాయన్న కారణాన్ని చూపుతూ ఎల్‌టీ పారిశ్రామిక విద్యుత్‌ టారిఫ్‌ కింద యూనిట్‌కు 6.70 వంతున డిస్కంలు వసూలు చేస్తున్నాయి. దీంతో ఒక మోస్తరు కోళ్ల ఫారాలపై నెలకు 40 వేల అదనపు భారం పడుతోంది. దీనికితోడు ట్రూఅప్, ఎఫ్‌పీపీసీఏ ఛార్జీలనూ భరించాల్సి వస్తోందని పౌల్ట్రీ నిర్వాహకులు వాపోతున్నారు.

"పరోక్షంగా రాబడి తెచ్చుకుందాం అని ప్రభుత్వం చేసే పని ఇది. గతంలో యూనిట్​కి 8 నుంచి 9 రూపాయలు పడేది. ఈ రోజు 14 రూపాయలు పడ్తోంది. ఈ పద్దతి ప్రకారం రాష్ట్రంలోకి కొత్త ఇండస్ట్రీలు రావు. ఉన్నవి రాష్ట్రంలోనుంచి బయటకు వెళ్లిపోతాయి." -పార్థసారథి, పారిశ్రామికవేత్త

Electricity Charges :విద్యుత్​ వినియోగదారులకు షాక్​.. మరోసారి సర్దుబాటు ఛార్జీల భారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.