ETV Bharat / state

'అనర్హులకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు... మాకెందుకు ఇవ్వరు?'

author img

By

Published : Jun 30, 2020, 6:31 PM IST

అనర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ... అర్హులైన తమకు మాత్రం ఇవ్వడం లేదని గుంటూరు జిల్లా సిరిపురం గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ రెవెన్యూ అధికారిని అడిగితే స్పందించడం లేదని ఆవేదన చెందారు. అర్హులైన వారందరికీ స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Dharna for giving home places to the siripuram villagers at guntur district
ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ సిరిపురం గ్రామస్తులు ధర్నా

ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం సిరిపురం గ్రామస్తులు... మేడికొండూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. అనర్హులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి.. అర్హులైన తమకు అన్యాయం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

నివేశన స్థలాలు ఇవ్వాలని గ్రామ రెవెన్యూ అధికారి చుట్టూ తిరుగుతున్నా... పట్టించుకోవడంలేదని వాపోయారు. అంతేకాకుండా గ్రామ రెవెన్యూ అధికారి.. తమను కించపరుస్తూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తక్షణమే ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని... అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

మాస్కు పెట్టుకోమన్నందుకే దారుణంగా కొట్టారు: బాధితురాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.