Chandrababu met Amit Shah: అమిత్ షా, నడ్డాతో చంద్రబాబు భేటీ

author img

By

Published : Jun 3, 2023, 10:14 PM IST

Updated : Jun 4, 2023, 6:24 AM IST

Chandrababu met Amit Shah

22:09 June 03

అమిత్‌షాను కలిసిన చంద్రబాబు నాయుడు

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. శనివారం మధ్యాహ్నం దిల్లీ చేరుకున్న చంద్రబాబు.. రాత్రి 8 గంటల సమయంలో అమిత్‌ షా నివాసంలో జేపీ నడ్డా షాను కలిశారు. చంద్రబాబు దిల్లీ పర్యటన ప్రైవేటు కార్యక్రమమని పార్టీ వర్గాలు తెలిపాయి.

2019 ఎన్నికల తర్వాత ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌ సమయంలో ఒకసారి ప్రధాని మోదీని చంద్రబాబు కలిశారు. జీ20 సన్నాహక సదస్సుకు హాజరయ్యేందుకు దిల్లీ వెళ్లినప్పుడు మరోసారి భేటీ అయ్యారు. టచ్‌లో ఉండాలంటూ ఆ సందర్భంగా చంద్రబాబుకు మోదీ సూచించిన విషయం తెలిసిందే. తాజాగా చంద్రబాబు జేపీ నడ్డా, అమిత్ షాతో భేటీ కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, భాజపా కలిసి పోటీ చేస్తాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు దిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Last Updated :Jun 4, 2023, 6:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.