ETV Bharat / state

గ్రామాల్లో విస్తరిస్తున్న కరోనా.. అప్రమత్తమైన అధికారులు

author img

By

Published : Jul 20, 2020, 10:36 PM IST

guntur district
గ్రామస్థులకు కరోనా పరీక్షలు

గుంటూరు జిల్లా గ్రామాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. మెడికొండ్రు మండల పరిధిలో 25 కేసులు నమోదయ్యాయి. పరిసర గ్రామాల్లోనూ అనుమానితులకు వేగంగా కొవిడ్ నిర్థరణ పరీక్షలు చేస్తున్నారు.

గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మేడికొండ్రు ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో 104 మందికి కరోనా పరీక్షలు చేశారు. గ్రామాల్లో వైరస్ విస్తరిస్తుండడంపై ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

ఇప్పటికే మెడికొండ్రు మండల పరిధిలో 25 మంది కరోనా భారిన పడ్డారు. అధికారులు గామస్థులందరికీ పరీక్షలు చేశారు. మెడికొండ్రు, పేరేచర్ల, కొర్రపాడు, విసదల గ్రామస్థుల నమునాలు సేకరించారు.

ఇదీ చదవండి:

'సమస్యలు పరిష్కరించకుంటే.. రేషన్​ ఇచ్చేది లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.