అప్పులు పెరుగుతున్నా.. మూలధన వ్యయం తగ్గుతుంది..!

author img

By

Published : Jan 4, 2023, 6:51 AM IST

అప్పులు

Rising Debt in the State: ఏ రాష్ట్రంలోనా తమ ఆర్ధిక వ్యవస్ధను మెరుగుపరిచేందుకు.. ఆయా ప్రభుత్వాలు రాష్ట్ర ఖజానా నుంచైనా, మార్కెట్ నుంచి అప్పులు తీసుకోనైనా మూలధనం కోసం ఖర్చు చేస్తుంటాయి..కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నం.. ఎందుకంటే ఈ ప్రభుత్వం బహిరంగ మార్కెట్​లో అప్పులు తీసుకుని మరీ సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించుకుంది.

Rising Debt in the State: రాష్ట్రంలో అప్పులు..లెక్కకు మిక్కిలిగా పెరిగిపోతున్నాయి. అదే సమయంలో ఆస్తుల సృష్టికి ఉపయోగపడే మూలధన వ్యయం కుంటుపడింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో.. తొలి 8 నెలల లెక్కలను పరిశీలిస్తే 6వేల188 కోట్ల రూపాయలు మాత్రమే.. ఆస్తులు సృష్టించేందుకు ప్రభుత్వం వ్యయం చేసింది.

ఈ ఏడాది.. 30వేల 679 కోట్ల రూపాయలు మూలధన వ్యయం కింద ఖర్చు చేస్తామని ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనల్లో తెలిపింది. అయితే.. అంచనాల్లో 20శాతం మాత్రమే వినియోగించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో అప్పులు మాత్రం ఏకంగా అంచనాలకు మించి 11 శాతం అధికంగా తీసుకువచ్చింది. ఈ అప్పుల లెక్కల్లో కార్పొరేషన్ల రుణాల లెక్కల్ని బయటకు వెల్లడించడం లేదు. వాటిని కూడా కలిపితే రుణం అంచనాలకు మించి ఎన్నో రెట్లు పెరిగిపోతుంది.

సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, పోర్టులు, ఇతరత్రా ఆస్తులు సృష్టికి వెచ్చించే మొత్తాన్ని మూలధన వ్యయంగా పేర్కొంటారు. ఈ ఖర్చు వల్ల ఏర్పరచుకునే ఆస్తి నుంచి మళ్లీ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏటా దీనికి చాలా తక్కువే కేటాయిస్తూ వస్తోంది. మూలధన వ్యయం బాగా తగ్గిందని కాగ్ లెక్కలు కూడా చెబుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబరు నెలాఖరు వరకు చేసిన ఖర్చుల వివరాలను కాగ్ వెల్లడించింది. వాటి ఆధారంగా చూస్తే మూలధన వ్యయం మరీ తక్కువగా ఉంది. 8 నెలల్లో కేవలం అంచనాల్లో 20శాతానికే పరిమితమైంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.