ETV Bharat / state

ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి చలి కాచుకుంటున్నారు..

author img

By

Published : Nov 7, 2022, 8:48 AM IST

బాల కోటయ్య అమరావతి బహుజన ఐకాస కన్వీనర్
బాల కోటయ్య అమరావతి బహుజన ఐకాస కన్వీనర్

Balakotiah interview: మూడు రాజధానులు పేరిట ముఖ్యమంత్రి జగన్ చలికాచుకొంటున్నారని అమరావతి బహుజన ఐకాస కన్వీనర్ పోతుల బాల కోటయ్య విమర్శించారు. మూడు రాజధానుల వల్ల రాష్ట్రం మూడు ముక్కలు అయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ప్రాంతం పైకి మరో ప్రాంతాన్ని ఉసిగొల్పేందుకు.. అమరావతి నుంచి రాజధాని తరలించడం గొడ్డలిపెట్టుగా అభివర్ణించారు. ఈ చర్యలు వలన ఎక్కువగా నష్టపోయేది బహుజన కులాలు వారే అని వాపోయారు. రైతుల ఉద్యమానికి తలొగ్గిప్రధాని నరేంద్ర మోడీ ఆచట్టాలను వెనక్కి తీసుకున్నారని.. ముఖ్యమంత్రి జగన్ అయన కంటే ఘనుడా అని ఈటీవీ ముఖాముఖిలో బాల కోటయ్య ప్రశ్నించారు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.