ETV Bharat / state

అయేషా మీరా రీపోస్టుమార్టం పూర్తి... నివేదికే కీలకం

author img

By

Published : Dec 15, 2019, 6:56 AM IST

అయేషామీరా హత్య కేసులో రీ పోస్ట్ మార్టం పూర్తయింది. ఐదు గంటలకు పైగా ఈ ప్రక్రియ కొనసాగింది. సీబీఐ ఎస్పీ విమల్ ఆదిత్య నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఫోరెన్సిక్ నిపుణుల బృందం అయేషామీరా పుర్రె, ఎముకలను సేకరించి హైదరాబాద్ తీసుకెళ్లారు. ఫోరెన్సిక్ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా సీబీఐ తదుపరి విచారణ సాగనుంది.

Ayesha_meera_cbi _Case_Repostmartem
అయేషామీరా హత్య కేసులో రీ పోస్ట్ మార్టం పూర్తి... నివేదికే కీలకం

అయేషామీరా హత్య కేసులో రీ పోస్ట్ మార్టం పూర్తి... నివేదికే కీలకం

అయేషామీరాపై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హత్యాచారానికి కారకులెవరో తేల్చాలన్న హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగింది సీబీఐ. గతంలో ఆధారాలు ధ్వంసం కావడంతో రీ పోస్టుమార్టం నిర్వహించింది. తొలుత బాధిత కుటుంబం, ముస్లిం మతపెద్దల వ్యతిరేకతతో విజయవాడ నాలుగో అదనపు చీఫ్ మెట్రోపాలిటిన్ మహిళా కోర్టు నుంచి సీబీఐ అనుమతి పొందింది. గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటలోని స్మశానవాటికలో... అయేషామీరా సమాధిని అధికారులకు ఆమె తండ్రి ఇక్బాల్ చూపించారు. ముస్లిం మతపెద్దల సమక్షంలో ఆ ప్రదేశాన్ని తవ్వారు. శనివారం ఉదయం 8 గంటల 30 నిమిషాలకు రీ పోస్ట్‌మార్టం ప్రక్రియ మొదలుపెట్టి... మధ్యాహ్నం 2 గంటల 30నిమిషాలకు ముగించారు. సీబీఐ ఎస్పీ విమల్ ఆదిత్య నేతృత్వంలో మొత్తం 15మంది అధికారులు పాల్గొన్న పోస్టుమార్టం ప్రక్రియ మొత్తాన్ని చిత్రీకరించారు.

పుర్రె, ఎముకల నమూనాల సేకరణ

అయేషామీరా మృతదేహంపై కేవలం ఒక గాయం గుర్తించినట్లు గతంలో దర్యాప్తు చేసిన పోలీసులు రూపొందించిన ఛార్జిషీట్లో నమోదు చేశారు. అలా కాకుండా ఇంకా గాయాలేమైనా ఉన్నాయా అనే కోణంలో నిపుణులు శనివారం పరిశీలించారు. పుర్రెభాగంలో గాయాలను గుర్తించి సంబంధిత ఎముకలను సేకరించారు. భుజం ఎముక, ఎడం వైపు పక్కటెముక, దవడపళ్లు రెండింటిని సేకరించి... డీఎన్​ఏ పరీక్షలకు భద్రపరిచారు. మతాచారాల ప్రకారం మిగతా అస్థిపంజరాన్ని పూడ్చివేశారు. సేకరించిన ఎముకలను ఫోరెన్సిక్ బృందం హైదరాబాద్ పంపింది. మొత్తం ప్రక్రియను చట్టపరంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

రోజా ఇప్పుడెందుకు స్పందించట్లేదు...

తమ బిడ్డను ఎవరు చంపారో తేల్చి శిక్ష పడేలా చేసేందుకు 12 ఏళ్లుగా ఎదురు చూస్తున్నామని అయేషామీరా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు చట్టంపై నమ్మకం లేదని.... సీబీఐ అధికారులు నిష్పాక్షికంగా విచారణ జరపాలని కోరారు. సమాజం కోసమైనా నిందితులను పట్టుకుని శిక్షించాలని విఙ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దిశ చట్టం ప్రకారం అయేషామీరా హత్య కేసు విచారణ జరిపి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. గతంలో తమకు అండగా నిలబడిన వైకాపా నేత రోజా ఇపుడు అసెంబ్లీలో ఎందుకు దీనిపై మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సేకరించిన ఆధారాల ప్రకారం అయేషామీరా ఎలా చనిపోయిందనేది నిర్ధరించే అవకాశాలున్నాయి. అలాగే అత్యాచారం సమయంలో ఆమెపై మత్తు మందు ప్రయోగించారా వంటి అంశాలు వెల్లడి కానున్నాయి.


ఇవీ చూడండి-చిన్నారిపై ఏడాదిగా మృగాడి అత్యాచారం.. బాలిక తల్లి ప్రోద్బలంతోనే..!

Reporter : S.P.Chandra Sekhar Contributor : N.Raju, Tenali- GNT Dist. Camera : Kesav Date : 14-12-2019 Centre : Guntur File : Ap_Gnt_08_14_Ayesha_Case_RePostmartam_Overall_PKG_3053245_AP10037 NOTE : ఫీడ్ 3G KIT ద్వారా వచ్చింది....... గమనించగలరు........ ( ) అయేషామీరా హత్య కేసులో రీ పోస్ట్ మార్టం పూర్తయింది. ఐదు గంటలకు పైగా ఈ ప్రక్రియ కొనసాగింది. సిబిఐ ఎస్పీ విమల్ ఆదిత్య నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఫోరెన్సిక్ నిపుణుల బృందం అయేషామీరా పుర్రె, ఎముకలను సేకరించి హైదరాబాద్ తీసుకెళ్లారు. ఫోరెన్సిక్ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా సిబిఐ తదుపరి విచారణ సాగనుంది....LOOK వాయిస్ ఓవర్ - 1- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన ఆయేషామీరా అత్యాచారం, హత్య కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ జరుపుతున్న సీబీఐ అధికారులు ఇవాళ అయేషా మృతదేహానికి మళ్లీ శవ పరీక్ష నిర్వహించారు. ఆధారాలు సేకరించే క్రమంలో అయేషా మృతదేహాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో వెలికితీయాల్సి వచ్చింది. ఇవాళ తెల్లవారుజామున సీబీఐ ఎస్పీ విమల్‌ ఆదిత్య బృందం తెనాలి చేరుకుంది. ఢిల్లీతో పాటు హైదరాబాద్ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణుల బృందం రీపోస్టుమార్టం ప్రక్రియ చేపట్టింది. ఉదయమే శవపరీక్ష జరపాల్సి ఉన్నా మంచు కారణంగా వాయిదా వేశారు. 9:30 గంటల సమయంలో పోస్టుమార్టం ప్రక్రియను మొదలుపెట్టారు. గతంలో ఆయేషామీరా మృతదేహాన్ని ఖననం చేసే సమయంలో ఉన్న మత ప్రముఖులను ఇప్పుడూ రీపోస్టుమార్టంకోసం పిలిపించారు. ముస్లిం మతాచారాల ప్రకారం కార్యక్రమం నిర్వహించారు. సమాధి తవ్వి ఆయేషామీరా మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్లను ఫోరెన్సిక్‌ నిపుణులు సేకరించారు. మృతదేహం పూర్తిగా పాడైపోవటంతో అస్తికలు, పుర్రె, కేశాలు, గోర్లు బయటకు తీశారు. వాటిని క్రమపద్ధతిలో అమర్చారు. హత్య సమయంలో అయేషామీరా తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. పుర్రె పై గాయాలకు సంబంధించిన ఆనవాళ్లను నిపుణులు పరిశీలించారు. పుర్రె భాగాలతో పాటు కొన్ని ఎముకలను శాస్త్రీయంగా ప్యాక్ చేసి సీల్ చేసి తమ వెంట తీసుకెళ్లారు. వాటిని హైదరాబాద్ లోని ల్యాబ్ లో విశ్లేషించనున్నారు. తెనాలి రెవిన్యూ అధికారులు రీ పోస్ట్ మార్టం కు సంబంధించి పంచనామా నిర్వహించారు. చట్ట ప్రకారం చేయాల్సిన కార్యక్రమం నిర్వహించామని... మిగతా పని ఫోరెన్సిక్, సిబిఐ బృందాలు చేస్తాయని తెనాలి తహసీల్దార్ రవిబాబు తెలిపారు. రీ పోస్ట్ మార్టం తర్వాత అయేషామీరా శరీర భాగాలను ముస్లిం సంప్రదాయాల ప్రకారం మళ్లీ పూడ్చినట్లు మత పెద్దలు తెలిపారు. అయేషామీరా కుటుంబానికి న్యాయం జరగాలని, నిందితులకు శిక్ష పడాలని రీ పోస్ట్ మార్టం కు అంగీకరించినట్లు వారు తెలిపారు. బైట్... రవిబాబు, తెనాలి తహసీల్దార్ బైట్... హబీబ్ ఖాన్, ముస్లిం మత పెద్ద వాయిస్ ఓవర్ - 2- ఆయేషా మీరా తండ్రి ఇక్బాల్‌ బాషా మాట్లాడుతూ.. గతంలో జరిగిన విచారణ అంతా బోగస్ అని అభివర్ణించారు. ప్రస్తుతం సీబీఐ విచారణకు తాము పూర్తిగా సహకరిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ చట్టం సరైంది కాదన్నారు. చట్టాలు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలే తప్ప.. రాజకీయాల కోసం కాదన్నారు. ఆయేషా హత్య కేసులో అసలు నిందితులను పట్టుకోవడం ద్వారా సమాజానికి న్యాయం జరుగుతుందన్నారు. అయితే అయేషామీరా తల్లి మాత్రం దిశ చట్టం గురించి విభిన్నంగా స్పందించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దిశ చట్టం ప్రకారం అయేషామీరా హత్య కేసు విచారణ జరిపి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. గతంలో తమకు అండగా నిలబడిన రోజా ఇపుడు అసెంబ్లీలో ఎందుకు అయేషామీరా హత్య గురించి మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బైట్ 3: ఇక్బాల్ బాషా, ఆయేషా మీరా తండ్రి బైట్-4- శంషాద్ బేగం, అయేషామీరా తల్లి ఎండ్ వాయిస్ ఓవర్ - ఇవాళ సేకరించిన ఆధారాల ప్రకారం అయేషామీరా ఎలా చనిపోయిందనేది నిర్ధారించవచ్చు. అలాగే అత్యాచారం సమయంలో ఆమెపై మత్తు మందు ప్రయోగించారా వంటి అంశాలు వెల్లడి కానున్నాయి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.