ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 5 PM

author img

By

Published : Nov 27, 2022, 5:00 PM IST

.

AP TOP NEWS
AP TOP NEWS

  • ఛాలెంజ్ చేస్తున్నా.. వైకాపా మళ్లీ ఎలా గెలుస్తుందో చూస్తా: పవన్​కల్యాణ్​
    Pawan Kalyan: ఇప్పటంలో ఇళ్లను కోల్పోయిన వారికి జనసేన అధినేత పవన్​కల్యాణ్​ సాయం అందచేశారు. రాబోయే రోజుల్లో రాజకీయాలు మారాలని అన్నారు. వైసీపీని దెబ్బకోట్టాలంటే ఎవరితో చెప్పి చేయనని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 16 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్, మూడు వాహనాలు స్వాధీనం
    Red sandalwood smugglers: వైయస్సార్ జిల్లా నుంచి.. అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తున్న స్మగ్లర్లను.. బ్రహ్మంగారిమఠం పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో తమిళనాడుకు చెందిన కొంతమంది స్మగ్లర్లు ఉన్నారని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • చిత్తూరు జిల్లాలో అర్ధరాత్రి ఏనుగు బీభత్సం
    Elephant: చిత్తూరు జిల్లాలో ఓ ఏనుగు రాహదారిని దాటేందుకు ప్రయత్నించింది. అది సరిగా రోడ్డు దాటి అడవిలోకి వెళ్లినా బాగుడేంది. కానీ రోడ్డు దాటకుండా అక్కడే ఉండి స్థానికులకు చుక్కలు చూపించింది. ఇంతకీ ఏమైందంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • దోమకొండ కోటకు యునెస్కో పురస్కారం
    UNESCO Award for Domakonda Fort : తెలంగాణ రాష్ట్రంలో పురాతన కట్టడమైన దోమకొండ కోటకు అరుదైన గౌరవం లభించింది. యునెస్కో ఆసియా-పసిఫిక్‌ అవార్డ్‌ ఫర్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ కన్జర్వేషన్‌, అవార్డ్‌ ఆఫ్‌ మెరిట్‌ ఫర్‌ 2022కు ఈ కోట ఎంపికైనట్లు దోమకొండ ట్రస్ట్‌ సభ్యులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'జీ20 అధ్యక్ష హోదాలో ప్రపంచ సంక్షేమం కోసమే కృషి'
    శక్తిమంతమైన జీ-20 అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు భారత్‌ సిద్ధమైందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రపంచం ఎదుర్కొంటున్న శాంతి, ఐక్యత, సుస్థిరాభివృద్ధి, పర్యావరణం వంటి సవాళ్లకు భారత్‌ వద్ద పరిష్కారం ఉందన్నారు. విక్రమ్-ఎస్‌ పేరుతో తొలిసారి ప్రైవేటురంగం ద్వారా అంతరిక్షంలోకి రాకెట్‌ను పంపినట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఐఐటీ వాళ్లకే అద్దెకు ఇల్లు.. లింక్​డ్​ఇన్​ ప్రొఫైల్​, సాలరీ స్లిప్స్ మస్ట్.. హౌస్ ఓనర్ల వింత రూల్స్
    మెట్రో నగరాల్లో ఇల్లు అద్దెకు లభించడం అంటే గగనమే అని చెప్పాలి. ఇంటి కోసం ఎన్నో రోజులు కష్టపడి తిరిగితే తప్ప దొరకదు. ఇప్పటికే ఇల్లు అద్దెకు దొరకడం కష్టంగా ఉన్న సమయంలో యజమానుల పెట్టే కొత్త నిబంధనలతో అది మరింత అసాధ్యంగా మారిపోయింది. బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ చేసిన పోస్ట్​ ఇప్పడు వైరల్​గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • జిన్​పింగ్​కు బిగ్​ షాక్​ ఇస్తూ కొవిడ్ లాక్​డౌన్​ నిరసనలు తీవ్రం
    జీరో కొవిడ్ పాలసీని వ్యతిరేకిస్తూ చైనాలో ఆందోళనలు పెరుగుతున్నాయి. వైరస్‌ కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కమ్యూనిస్టు దేశంలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతూనే ఉంది. కేసుల సంఖ్య పెరిగే కొద్దీ ఆంక్షల పరిధిని అధికారులు విస్తరిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • దేహదారుఢ్య పరీక్షలకు వేళాయే.. వచ్చే నెల 8 నుంచే..
    Si Constable Updates: డిసెంబర్ 8 నుంచి ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 3 వరకు ఆన్​లైన్​లో అడ్మిట్ కార్డు డౌన్​లోడ్​ చేసుకోవాలని పోలీస్​ రిక్రూట్​మెంట్​ బోర్డ్ ఛైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 11 మైదానాలను సిద్ధం చేసినట్లు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రెండో వన్డే వరుణుడిదే.. భారత్‌కు కలిసిరాని సిరీస్​.. 1-0 ఆధిక్యంలో కివీస్
    భారత్, కివీస్‌ మధ్య జరగాల్సిన రెండో వన్డే వర్షార్పణమైంది. టాస్‌ ఓడిన టీమ్‌ఇండియా తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న క్రమంలో పలుసార్లు వర్షం ఆటంకం కల్పించడంతో ఆటను 29 ఓవర్లకు కుదించారు. అప్పటికీ వరుణుడు కనికరించకపోవడంతో.. మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • స్టన్నింగ్​ లుక్స్​లో రామ్​ చరణ్​.. రియాక్టైన కత్రినా కైఫ్!
    టాలీవుడ్​ కథానాయకుడు రామ్​ చరణ్​ నటిస్తున్న ఆర్​సీ15 సినిమా షూటింగ్​​ న్యూజిలాండ్​లో జరుగుతోంది. కాగా ఆ దేశ​ వీధుల్లో దిగిన ఫొటోలు​ రామ్​ చరణ్ షేర్ చేశారు. ఇప్పుడీ ఫొటోలు వైరల్​ అవుతున్నాయి. దీనిపై బాలీవుడ్​ తార కత్రినా కైఫ్​ రియాక్ట్​ అయ్యింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.