ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్ ఫీజులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధికంగా వసూలు చేస్తున్నారని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సోమవారం దీనిపై ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరపున కౌంటర్ దాఖలుకు అదనపు అడ్వకేట్ జనరల్ గడువు కోరగా... కేసు విచారణను వారం రోజులపాటు వాయిదా వేస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త తోట సురేష్ బాబు తరపున న్యాయవాది నర్రా శ్రీనివాసరావు ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఆయా ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫీజుల వసూలుపై నిర్దిష్ట సమాచారం, అదనపు వివరాలను హైకోర్టు కోరగా...,పిటిషనర్ తరపు న్యాయవాది అదనపు అఫిడవిట్ దాఖలు చేశారు.
ఇదీచదవండి