ETV Bharat / state

రాష్ట్రంలో నాలుగు వర్సిటీలకు తాత్కాలిక ఇంచార్జ్​లుగా వైస్​ చాన్సలర్లు

author img

By

Published : Jan 7, 2023, 10:38 AM IST

వైస్​ చాన్సలర్లు
వైస్​ చాన్సలర్లు

Temporary incharges of Universities: రాష్ట్రంలోని నాలుగు వర్సిటీలకు తాత్కాలికంగా బాధ్యతలను నిర్వహించేందుకు వైస్​ చాన్సలర్లను నిమయమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది..ఆ నాలుగు వర్సిటీలేంటంటే..?

Temporary incharges of Universities: రాష్ట్రంలో నాలుగు విశ్వవిద్యాలయాలకు తాత్కాలిక ఇంఛార్జ్‌లుగా ఉపకులపతులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యోగివేమన విశ్వవిద్యాలయానికి జేఎన్​టీయు వీసీ ప్రోఫెసర్ జి.రంగ జనార్ధన్‌ను. పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయానికి శ్రీవెంకటేశ్వరా విశ్వవిద్యాలయ వీసీ ప్రోఫెసర్ రాజా రెడ్డిని.. దికవి నన్నయ్య యూనివర్సిటీకి కాకినాడ జేఎన్​టీయు వీసీ ప్రోఫెసర్ జీవీ ప్రసాదరాజును.. కృష్ణా యూనివర్సిటీకి ఏపీ ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు ప్రోఫెసర్ రామమోహన్ రావులను తాత్కాలిక ఇంఛార్జ్‌లుగా నియమించింది. ప్రస్తుత వీసీల పదవీకాలం 2023 జనవరి 7న ముగుస్తుండటంతో ఈ నాలుగు విశ్వవిద్యాలయాలకూ ప్రభుత్వం ఇంఛార్జీ వీసీలను నియమించింది. శాశ్వత ఉపకులపతులను నియమించే వరకూ వీరు అదనపు విధుల్లో కొనసాగనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.