ETV Bharat / state

అమరావతి కోసం ఆగిన మరో రైతు గుండె

author img

By

Published : Oct 14, 2020, 10:12 AM IST

రాజధాని అమరావతి కోసం మరో రైతు గుండె ఆగింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామానికి చెందిన సుబ్బారావు ఈ ఉదయం గుండెపోటుతో మరణించారు. రైతు మృతి పై రాజధాని పరిరక్షణ ఐకాస నాయకులు సంతాపం తెలిపారు.

another farmer died in amaravathi
అమరావతి కోసం ఆగిన మరో రైతు గుండె

రాజధాని ఉద్యమంలో మరో రైతు ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామానికి చెందిన సుబ్బారావు ఈ ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. సుబ్బారావు గత నాలుగు రోజులుగా అమరావతి ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్నారు. రాజధాని నిర్మాణం కోసం ఎకరా 18 సెంట్లు భూమిని ప్రభుత్వానికి ఇచ్చారు. రైతు మృతి పై రాజధాని పరిరక్షణ ఐకాస నాయకులు సంతాపం ప్రకటించారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కుండపోత వానలు... లక్షల ఎకరాల్లో మునిగిన పంటలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.