ETV Bharat / state

పండగ వేళ అంగన్వాడీల ఆకలి 'మంటలు' - ప్రభుత్వం ఉద్యోగాల తొలగించినా తిరిగి ఉద్యోగాలిస్తామని లోకేశ్ హామీ

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 14, 2024, 8:27 AM IST

Anganwadi Protest Against YSRCP Government: జగన్‌ ప్రభుత్వ వైఖరితో పండగపూటా పస్తులు ఉండాల్సిన దుస్థితి నెలకొందని అంగన్వాడీలు ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకుండా చర్చల పేరుతో ప్రభుత్వం డ్రామాలాడుతోందని మండిపడ్డారు. విధుల్లో చేరకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తామని ప్రభుత్వం చేస్తున్న బెదిరింపులకు నిరసనగా ఎస్మా ప్రతులను భోగిమంటల్లో వేసి దహనం చేశారు. అంగన్వాడీలు తాము చెప్పినట్లు వినకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ సజ్జల బెదిరింపులకు దిగడాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు.

anganwadi_protests
anganwadi_protests

పండగ వేళ అంగన్వాడీల ఆకలి 'మంటలు' - ప్రభుత్వం ఉద్యోగాల తొలగించినా తిరిగి ఉద్యోగాలిస్తామని లోకేశ్ హామీ

Anganwadi Protest Against YSRCP Government: పనికి తగ్గ ప్రతిఫలం కోసం పోరాడుతున్న మహిళలపై ప్రభుత్వం కనికరం లేకుండా వ్యవహరిస్తోందని అంగన్వాడీలు 33వ రోజు ఆందోళనలతో హోరెత్తించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుంచి బోసు బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. పోరాటానికి ప్రజా మద్దతు కోరుతూ సంతకాల సేకరణ చేపట్టారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించే వరకూ ఉద్యమం ఆపేదిలేదని ఒంగోలు కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలు నిరాహార దీక్ష చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని దీక్షా శిబిరం నుంచి సోమప్ప కూడలి వరకు కోటి సంతకాల సేకరణ చేపట్టారు. నంద్యాలలో గుమ్మడి కాయలు కొట్టి అంగన్వాడీలు నిరసన తెలిపారు. బద్వేల్‌లో మూడు నామాలు పెట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ప్రభుత్వం ఉక్కు పాదం మోపినా సమ్మె పట్టు సడలించేది లేదు- అంగన్వాడీలు

తిరుపతి పాత మున్సిపల్‍ కార్యాలయం వద్ద భోగి మంటలు వేసి ఎస్మా జీవో ప్రతులను తగలబెట్టారు. పలమనేరులో అంగన్వాడీలకు మాజీ మంత్రి అమర్నాథ్‌ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. నాయుడుపేట ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట భోగి మంటలు వేసి సమస్యల్ని పరిష్కరించాలని పాటలు పాడారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎస్మా ప్రతులను భోగిమంటలో వేసి దహనం చేశారు. బుక్కరాయసముద్రం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద జగనన్నకు చెబుదామంటూ.. అంగన్వాడీలు కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఉరవకొండలోని హంద్రీనీవా జలాల్లో ఎస్మా జీవో ప్రతులను వదిలి అంగన్వాడీలు నిరసన తెలిపారు. అంగన్వాడీల సమ్మెకు సీపీఐ నేత రామకృష్ణ మద్దతు తెలిపారు. మేలో ఇంటికి వెళ్లే ముఖ్యమంత్రి జూలైలో అంగన్వాడీల వేతనాలు ఎలా పెంచుతారని దుయ్యబట్టారు.

ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తాం: అంగన్వాడీలు

సమస్యలు పరిష్కరించాలని నెల రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం కనికరం చూపడంలేదని అనకాపల్లిలో అంగన్వాడీలు భోగి మంటల్లో ఎస్మా ప్రతులను వేసి దహనం చేశారు. జగన్‌ ప్రభుత్వ మొండి వైఖరితో పండగపూట పస్తులు ఉండాల్సిన దుస్థితి నెలకొందని మామిడి కుదురు, రాజోలు ప్రాంతాల్లో అంగన్వాడీలు నిరసన తెలిపారు. మాట ఇచ్చిన సీఎం కనీస వేతనం ఇవ్వాలని విశాఖలో ఆందోళనల్ని ఉద్ధృతం చేశారు. సంక్రాంతిని జీవితంలో గుర్తిండిపోయేలా చేసిన జగన్‌ ను మర్చిపోమంటూ హెచ్చరించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జీవో ప్రతులను భోగి మంటల్లో దహనం చేసి అంగన్వాడీలు నిరసన తెలిపారు.

ప్రభుత్వానికి మాపై కక్ష ఎందుకు? - చర్చలకు పిలవకుంటే ఆందోళన ఉద్ధృతం: అంగన్వాడీలు

మూడు నెలల్లో ప్రజాప్రభుత్వం : అంగన్వాడీలు తాము చెప్పినట్లు వినకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ సజ్జల బెదిరింపులకు దిగడాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. అంగన్వాడీల పోరాటానికి సంఘీభావం తెలిపిన లోకేశ్‌ అధికార అండతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న జగన్ సర్కారును ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బంగాళాఖాతంలో కలిపేందుకు జనం సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. జగన్‌ ప్రభుత్వం అంగన్వాడీలను ఉద్యోగాల నుంచి తొలగించినా ఎవరూ భయపడాల్సిన పనిలేదన్న లోకేశ్​ మరో మూడు నెలల్లో టీడీపీ-జనసేన నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం ఎటువంటి సర్వీసు అంతరాయం లేకుండా తిరిగి ఉద్యోగాల్లో నియమిస్తుందని హామీ ఇచ్చారు.

  • న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం 33రోజులుగా శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న అంగన్ వాడీలు తాము చెప్పినట్లు వినకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ ప్యాలెస్ బ్రోకర్ సజ్జల బెదిరింపులకు దిగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అధికారమదం తలకెక్కి కండకావరంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న జగన్…

    — Lokesh Nara (@naralokesh) January 13, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.